Inter Exams | నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు వచ్చేయండి..
Inter Exams | రాష్ట్రంలో నేటినుంచి ఇంటర్ పరీక్షలు (Inter Exams) ప్రారంభం కానున్నాయి. బుధవారం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్ష జరుగనుండగా, గురువారం నుంచి సెకండర్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి.
Inter Exams | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో నేటినుంచి ఇంటర్ పరీక్షలు (Inter Exams) ప్రారంభం కానున్నాయి. బుధవారం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్ష జరుగనుండగా, గురువారం నుంచి సెకండర్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలుంటాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 9,97,075 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 4,89,126 మంది విద్యార్థు మొదటి సంవత్సరంలో, 5,07,949 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నాయి. వీరికోసం 1,495 పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా సమయానికి 5 నిమిషాలు ఆలస్యమైన అనుమంతిచనున్నారు. ఆ తర్వాత అంటే ఉదయం 9.05 దాటిన తర్వాత వచ్చేవారికి పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు 30 నిమిషాల ముందే చేరుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా విద్యార్థులను ఎగ్జామ్ హాల్కు అనుమతిస్తామని చెప్పారు. ఈసారి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యార్థులు పూర్తి 3 గంటలూ పరీక్షా కేంద్రాల్లోనే ఉండాల్సి ఉంటుంది. ముందే పరీక్ష పూర్తి చేసినా.. మధ్యాహ్నం 12 గంటలు అయ్యే వరకూ ఉండాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే 040-24655027, 924402 05555 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
మంత్రి పొన్నం విషెస్
ఇంటర్ విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విషెస్ చెప్పారు. పరీక్ష రాసేందుకు వెళ్లే అమ్మాయిలు ఆర్టీసీలో ఆధార్ కార్డ్ చూపించాల్సిన అవసరం లేదన్నారు. వారి హాల్ టికెట్ చూపిస్తే చాలని.. వారికి ఉచిత టికెట్ ఇస్తారన్నారు. ఇంటర్ విద్యార్థుల కోసం అదనంగా ప్రత్యేక బస్సులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పరీక్షల సమయంలో బస్టాండ్స్ దగ్గరే కాకుండా.. విద్యార్థులు ఎక్కడ ఆపినా ఆపాలని సిబ్బందికి సూచించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



