త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Control Room | మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌.. తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్‌

ontrol Room | మధ్యప్రాచ్యంలో (Middle East) నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ (Telangana) పౌరుల కోసం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం కంట్రోల్ రూమ్ (Control Room) ఏర్పాటు చేసింది.

G

Telangana | Published On Mar 2, 2026, 1.41 pm IST

Control Room | మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌.. తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్‌
Advertisement

Control Room | త్రినేత్ర‌.న్యూస్‌: మధ్యప్రాచ్యంలో (Middle East) నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ (Telangana) పౌరుల కోసం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం కంట్రోల్ రూమ్ (Control Room) ఏర్పాటు చేసింది. ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న విచారణలను దృష్టిలో ఉంచుకుని కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుంద‌ని అధికారులు తెలిపారు. అవసరమైన సమన్వయం, సహాయం అందించేలా పనిచేస్తుంద‌న్నారు.

మధ్యప్రాచ్య ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఏర్పడుతున్న పరిస్థితులను ప్ర‌భుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల‌తో న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు, తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చ‌ని తెలిపారు.

కంట్రోల్ రూమ్ నంబర్లు

  • వందన బరువా, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ అండ్‌ లైజన్ హెడ్- +91 9871999044
  • సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- +91 9958322143
  • జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్- 9910014749
  • రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్- +91 9643723157

మధ్యప్రాచ్య ప్రాంత పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement