త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

V Hanumantha Rao | బీసీలు ఎద‌గ‌డం మోదీకి ఇష్టం లేదు : వీహెచ్

V Hanumantha Rao | బీసీలు ఎద‌గ‌డం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఇష్టం లేద‌ని తెలంగాణ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వీ హ‌హ‌నుమంత‌రావు పేర్కొన్నారు. జ‌న‌గ‌ణ‌న‌లో కుల‌గ‌ణ‌న చేయాల‌న్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On May 20, 2026, 2.34 pm IST

V Hanumantha Rao | బీసీలు ఎద‌గ‌డం మోదీకి ఇష్టం లేదు : వీహెచ్
Advertisement

V Hanumantha Rao |  త్రినేత్ర‌.న్యూస్ : బీసీలు ఎద‌గ‌డం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఇష్టం లేద‌ని తెలంగాణ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వీ హ‌హ‌నుమంత‌రావు పేర్కొన్నారు. జ‌న‌గ‌ణ‌న‌లో కుల‌గ‌ణ‌న చేయాల‌న్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. జ్యుడిషియ‌రీ జిందాబాద్.. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మ‌క‌మైన‌ది అని పేర్కొన్న వీహెచ్.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

60 కోట్ల ప్రజలకు న్యాయం చేసిన జస్టిస్ సూర్యకాంత్‌కి రుణపడి ఉంటామ‌ని ఆయ‌న అన్నారు. కులగణన చేయాలని రాహుల్ గాంధీ ఆలోచన చేశారు. దానిక‌నుగుణంగానే రేవంత్ ప్రభుత్వం కులగణన చేసింది. బీసీలు ఎదగడం మోదీ ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. మోదీ మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు అన్ని విషయాలు తెలుసు. 18వ శతాబ్దంలోనే జ్యోతిరావ్ ఫూలే మాకు అన్ని నేర్పాడని వీ హ‌నుమంత‌రావు తెలిపారు.

Advertisement
Advertisement