త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythu Bharosa | తెలంగాణ రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. ఈ నెల 22 నుంచి ఖాతాల్లోకి రైతుభ‌రోసా నిధులు..!

Rythu Bharosa | తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లోనే రైతుభ‌రోసా నిధులు విడుద‌ల చేయ‌నున్న‌ది. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప‌థ‌కాన్ని కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. తొలి విడ‌త‌లో నగదు నేరుగా రైతుల ఖాతాల్లో ప్ర‌భుత్వం జ‌మ చేయ‌నున్న‌ది.

P

Telangana | Published On Mar 15, 2026, 7.15 pm IST

Rythu Bharosa | తెలంగాణ రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. ఈ నెల 22 నుంచి ఖాతాల్లోకి రైతుభ‌రోసా నిధులు..!
Advertisement

Rythu Bharosa | తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లోనే రైతుభ‌రోసా నిధులు విడుద‌ల చేయ‌నున్న‌ది. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప‌థ‌కాన్ని కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. తొలి విడ‌త‌లో నగదు నేరుగా రైతుల ఖాతాల్లో ప్ర‌భుత్వం జ‌మ చేయ‌నున్న‌ది. రాష్ట్ర‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డ‌నున్న‌ది. చాలాకాలంగా రైతు భ‌రోసా నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సిద్దిపేట జిల్లా న‌ర్మెట‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 22న ప‌ర్య‌టిస్తారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లోనే నిధుల‌ను అధికారికంగా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం రైతు భరోసా కింద ఏటా ఎకరానికి రెండు ద‌ఫాలుగా రూ.6వేల చొప్పున రూ.12 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్న విష‌యం తెలిసిందే. మొద‌టి విడుత‌లో ఎకరం వరకు వ్యవసాయ భూమి కలిగిన 70ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు బ‌దిలీ చేయ‌నుంది. రెండో విడ‌త‌గా మ‌రో 20 రోజుల త‌ర్వాత రూ.2,650 కోట్లు విడుద‌ల చేయ‌నుంది. ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు మూడో విడ‌త‌గా మిగ‌తా రైతులకు రైతుభ‌రోసా చెల్లించ‌నున్న‌ది. మూడు విడుత‌ల్లో క‌లిపి మొత్తం రూ.9వేల‌కోట్లు రైతుల ఖాతాలో జ‌మ చేయ‌నుంది.

Advertisement
Advertisement