త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPS Transfers | తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ, పోస్టింగ్‌లు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

Telangana, IPS Transfers | తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీలు, కొత్త పోస్టింగ్స్‌పై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2026 మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా బదిలీల్లో శిఖా గోయల్‌ను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. దేవేంద్ర సింగ్ చౌహాన్‌ను విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా బదిలీ చేశారు. పలువురు ఐపీఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

P

Telangana | Published On Apr 24, 2026, 6.48 pm IST

IPS Transfers | తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ, పోస్టింగ్‌లు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
Advertisement

IPS Transfers | తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. అలాగే, పలువురు అధికారులకు పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. బదిలీలు మే ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కొనసాగుతున్న శిఖా గోయల్‌ను హోంశాఖ ప్రిన్సిపాల్‌గా నియామకమయ్యారు. ఆమెకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ ల్యాబ్ అదనపు బాధ్యతలు ఇచ్చింది. దేవేంద్ర సింగ్ చౌహాన్‌ను విజిలెన్స్ అండ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా బదిలీ అయ్యారు.

షాహ్నవాజ్ ఖాసిమ్‌ను మల్టీ జోన్-2 ఐజీపీగా నియమించడంతో పాటు పర్సనల్ ఐజీపీ అదనపు బాధ్యతలు అప్పగించారు. తరుణ్ జోషిని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. సుధీర్ బాబు పదవీ విరమణ నేపథ్యంలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అవినాష్ మహంతిని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా బదిలీ చేయడంతో పాటు ఏసీబీ డైరెక్టర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. బీ సుమతిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా నియమించారు. కార్తికేయకు ఐజీపీ ఇంటెలిజెన్స్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement