త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy US Tour | రేవంత్ యూఎస్ టూర్ వెనుక అసలు ఉద్దేశం అదేనా? అందుకే కేంద్రం నో చెప్పిందా?

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. రాష్ట్రానికి పెట్టుబడుల పేరుతో అమెరికా, యూకేలకు వెళ్లి భారత వ్యతిరేక శక్తులను కలుస్తున్నారంటూ బీజేపీ నేత ఎన్.రామచందర్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

J

Telangana | Published On Aug 22, 2026, 2.33 pm IST

Revanth Reddy US Tour | రేవంత్ యూఎస్ టూర్ వెనుక అసలు ఉద్దేశం అదేనా? అందుకే కేంద్రం నో చెప్పిందా?
Advertisement
  • రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్‌పై భగ్గుమంటున్న ప్రతిపక్షాలు
  • ఎడ్యుకేషన్, పెట్టుబడుల ముసుగులో దేశ వ్యతిరేక వ్యక్తులను కలుస్తున్నారని బీజేపీ ఆరోపణ
  • యూకేలో మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీలతో రేవంత్ వేదిక పంచుకోవడంపై తీవ్ర అభ్యంతరం
  • అమెరికాలో జోరాన్ మమ్‌దానీని కలిసేందుకు యత్నించారంటూ రామచందర్ రావు ఫైర్

Revanth Reddy US Tour | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విదేశీ పర్యటనల చుట్టూ ఇప్పుడు ఓ పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీ నడుస్తోంది. ఈ టూర్స్ అసలు ఉద్దేశం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, లేదా ఎడ్యుకేషన్ సెక్టార్‌ను డెవలప్ చేయడం కాదని.. దీని వెనుక వేరే ఎజెండా ఉందంటూ భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సైద్ధాంతిక గురువులుగా భావించే పలువురు వివాదాస్పద వ్యక్తులను కలిసేందుకే సీఎం విదేశాలకు వెళ్లారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యక్తులతో సీఎంగా ఏం పని?

ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన యూకే (UK) పర్యటనలో మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ లాంటి వ్యక్తులతో ఒకే వేదిక పంచుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వీరు గతంలో తీవ్రమైన anti-India ఆర్టికల్స్ రాశారని రామచందర్ రావు గుర్తుచేశారు. ఇక అమెరికా (USA) పర్యటన విషయానికి వస్తే.. తీవ్ర వివాదాస్పద నేత జోరాన్ మమ్‌దానీ (Zohran Mamdani)ని కలిసేందుకు ముఖ్యమంత్రి గట్టి ప్రయత్నాలే చేశారని, ఇలాంటి భారత వ్యతిరేక వ్యక్తులతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం పని అని ప్రశ్నించారు.

కేంద్రం బ్రేక్.. ఆన్సర్ కావాలంటున్న బీజేపీ

జోరాన్ మమ్‌దానీ వ్యవహారంపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కూడా సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రోటోకాల్‌కి విరుద్ధంగా ఉన్న ఈ మీటింగ్ కారణంగానే ముఖ్యమంత్రి పర్యటనకు కేంద్రం బ్రేక్ వేసిందంటూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌పై సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. మొత్తానికి రాష్ట్ర అభివృద్ధి పేరుతో మొదలైన ఈ హై-ప్రొఫైల్ మీటింగ్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో సరికొత్త వివాదానికి దారితీశాయి.

Advertisement
Advertisement