Telangana Cabinet | 21న కేబినెట్ భేటీ.. భూముల విలువ పెంపుపై చర్చ..!
Telangana Cabinet | రాష్ట్ర కేబినెట్ 33వ సారి సమావేశం కానుంది. ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
Telangana Cabinet | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర కేబినెట్ 33వ సారి సమావేశం కానుంది. ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కేబినెట్ భేటీలో భూముల విలువ పెంపు , మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మాణం, రెండో దశ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై చర్చించనున్నట్లు సమాచారం.
అయితే ప్రధానంగా రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువపైనే కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే భూముల మార్కెట్ విలువల పెంపు దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాంతాల వారీగా ఎంత పెంచాలనే దానిపై ఇప్పటికే సంబంధిత అధికారులు నివేదికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే గరిష్ఠంగా వంద శాతం మించి పెంచకుండా సీలింగ్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో కనిష్ఠంగా 5 శాతం నుంచి 100 శాతం వరకు భూముల మార్కెట్ విలువలు పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 28 నుంచి కొత్త మార్కెట్ విలువల ప్రకారం స్టాంప్ డ్యూటీ వసూలు చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. భూముల విలువల పెంపు ద్వారా ఈ ఏడాది అదనంగా రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకూ ఆదాయాన్ని రాబట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
భూముల మార్కెట్ విలువ ఇలా..
- గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం భూమి విలువను కనిష్ఠంగా రూ.2.75 లక్షలు.
- మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎకరా కనిష్ఠ విలువ రూ.5 లక్షలు.
- ఓఆర్ఆర్ లోపల ఎకరా కనిష్ఠంగా రూ.15 లక్షలు.
- ఓఆర్ఆర్ ఆనుకుని ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో ఎకరా రూ.10 లక్షలు.
- ఓఆర్ఆర్ లోపల చదరపు గజం విలువ కనిష్ఠంగా రూ.3500 నుంచి రూ. 4000.
- ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఈ ధర రూ.3000 నుంచి రూ.3500.
- మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో గజం కనిష్ఠ విలువ రూ.2500 నుంచి రూ.3000.
- గ్రామీణ ప్రాంతాల పరిధిలో గజం కనిష్ఠ విలువ రూ.2000.
- ఓపెన్ ప్లాట్లకు సంబంధించి.. 15-20 శాతం ప్లాట్లకు వంద శాతం పెంపు.
- ఓఆర్ఆర్ లోపల రియల్ ఎస్టేట్ జోరుగా ఉన్నచోట్ల 50 శాతం ప్రాంతాల్లో ఫ్లాట్ల విలువను ఇప్పుడున్న దానికన్నా వంద శాతం పెంచుతున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



