త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

N Ramchander Rao | గత పదేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు రూ.12 లక్షల కోట్ల నిధులు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం, కోదాడ, నల్గొండలలో బీజేపీ భారీ బహిరంగ సభలు నిర్వహించింది. గత 12 ఏళ్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని వంచించాయని, ప్రధాని మోదీ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు స్పష్టం చేశారు.

J

Telangana | Published On Feb 8, 2026, 5.30 pm IST

N Ramchander Rao | గత పదేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు రూ.12 లక్షల కోట్ల నిధులు
Advertisement
  • తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు

N Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : గత పదేళ్లలో సుమారు రూ.12 లక్షల కోట్లను కేంద్రం తెలంగాణకు కేటాయించిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పష్టం చేశారు. ఈ నిధులు రైతులు, మహిళలు, యువత, అణగారిన వర్గాల సంక్షేమానికి నేరుగా ఉపయోగపడ్డాయని ఆయన వివరించారు. వివక్ష లేని అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం, కోదాడ, నల్గొండ నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభలు, రోడ్‌షోలలో ఇతర బీజేపీ ముఖ్య నేతలతో కలిసి రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన 12 ఏళ్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. అవినీతి, కుటుంబ పాలన, తప్పుడు వాగ్దానాలతో సామాన్యుల ఆశలను అణచివేశారని విమర్శించారు. ఈ రెండు పార్టీల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పడం ఖాయమని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు కాలం చెల్లింది

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల వైఖరితో ప్రజలు విసిగిపోయారని, ఇప్పుడు అందరూ బీజేపీ వైపే చూస్తున్నారని రామచందర్ రావు స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Telangana bjp president Ramchandar rao road show in kothagudem

కోదాడలో జన సంద్రం

కోదాడలో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. యువత, మహిళలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తరలివచ్చి బీజేపీకి మద్దతు ప్రకటించారని తెలిపారు. స్థానిక నేతలు శ్రీలత రెడ్డి, సైదిరెడ్డి, సంకినేని వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి నిర్వహించిన ఈ ప్రచారంలో 'మార్పు కావాలి - బీజేపీ రావాలి' అనే నినాదాలు మిన్నంటాయని రామచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

మార్పు దిశగా తెలంగాణ

తెలంగాణ సమాజం ఇప్పుడు డొల్ల వాగ్దానాలను నమ్మే స్థితిలో లేదని, సుపరిపాలన, అవినీతి రహిత పాలనను కోరుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖిస్తాయని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

https://x.com/N_RamchanderRao/status/2020380807878332801

https://x.com/N_RamchanderRao/status/2020454459718189387

https://x.com/N_RamchanderRao/status/2020448056655945905

 

Advertisement
Advertisement