త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Specialist Doctor Posts | స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు వ‌చ్చేశాయ్‌..! అభినంద‌న‌లు తెలిపిన మంత్రి రాజ‌న‌ర్సింహ‌

Specialist Doctor Posts | ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను అధిగమించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మరో 500 పోస్టుల తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది.

P

Telangana | Published On Jul 28, 2026, 7.49 pm IST

Specialist Doctor Posts | స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు వ‌చ్చేశాయ్‌..! అభినంద‌న‌లు తెలిపిన మంత్రి రాజ‌న‌ర్సింహ‌
Advertisement

Specialist Doctor Posts | ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను అధిగమించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మరో 500 పోస్టుల తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది. జనరల్ సర్జరీలో 174, జనరల్ మెడిసిన్‌లో 166, ఆర్థోపెడిక్స్‌లో 89, రేడియాలజీలో 71 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి తుది ఎంపిక జాబితాను వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను పూర్తిగా నివారించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం 24 విభాగాల్లో 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాల్లో 692 పోస్టుల భర్తీ పూర్తయింది. ఎంపికైన అభ్యర్థులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నియామక పత్రాలు అందజేయగా, ఇటీవలే పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. తాజా ఫలితాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 1,192 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎంపికైన వైద్యులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement