త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRSV | దమనకాండపై విద్యార్థుల పోరు.. రేవంత్‌కు మరో ఇరకాటం

BRSV | మూసీ ప్రాజెక్టుపై (Musi Project) బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ (BRSV) పోరుబాట పట్టనుంది. శ‌నివారం నుంచి ఈ నెల 14 వరకు పది రోజుల పాటు జరిగే ఈ యాత్రలో బీఆర్ఎస్వీ కార్యకర్తలు 50 బృందాలు గా విడిపోయి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానిస్తారు.

G

Telangana | Published On Apr 4, 2026, 11.14 am IST

BRSV | దమనకాండపై విద్యార్థుల పోరు.. రేవంత్‌కు మరో ఇరకాటం
Advertisement

BRSV | త్రినేత్ర‌.న్యూస్‌: మూసీ ప్రాజెక్టుపై (Musi Project) బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ (BRSV) పోరుబాట పట్టనుంది. శ‌నివారం నుంచి ఈ నెల 14 వరకు పది రోజుల పాటు జరిగే ఈ యాత్రలో బీఆర్ఎస్వీ కార్యకర్తలు 50 బృందాలు గా విడిపోయి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానిస్తారు. మూసీ పోరుబాట పేరుతో తలపెట్టిన ఈ యాత్రను బీఆర్ఎస్ఎల్పీ ఉప‌నేత‌, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ తెలంగాణ భవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై రేవంత్ ప్రభుత్వం జరుపుతున్న దమనకాండపై పోరాడేందుకు విద్యార్థులు నడుం బిగించడం హర్షించదగ్గ విషయమన్నారు.

ప్రభుత్వం దిగి వచ్చే వరకు మూసీపై తమ కార్యాచరణ కొనసాగుతుందని బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్, విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement