Kishan Reddy | మెట్రో రెండో దశకు అభ్యంతరం లేదు.. 50:50 ప్రాతిపదికన ముందుకెళ్లేందుకు కేంద్రం సిద్ధం: కిషన్రెడ్డి
Kishan Reddy | హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy0 అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50ః50 ఖర్చుచేసే ప్రాతిపతికన ముందుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
Kishan Reddy | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy0 అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50ః50 ఖర్చుచేసే ప్రాతిపతికన ముందుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో (Manohar Lal Khattar) కిషన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా.. మూసీనదిలో కలుస్తున్న మురుగు నీటిని శుద్ధి చేసేందుకు మొత్తం 39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.3,975 కోట్లని చెప్పారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
‘నగరంలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజారవాణాపై చర్చించాం. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఖట్టర్ చెప్పారు. మెట్రో రెండో దశక ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కేంద్ర, రాష్ట్రాలు చెరో సగం ఖర్చుతో ముందుకెళ్లేందుకు సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండోదశ విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించిందని, దానిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని ఖట్టర్ చెప్పారు. ఇక 39 ఎస్టీపీల ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని ఖట్టర్ స్పష్టం చేశారు. వారికి హైదరాబాద్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశా’ అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

Mallu Ravi | కిషన్రెడ్డి.. నిధులు తెచ్చి చిత్తశుద్ధిని చాటుకో: ఎంపీ మల్లు రవి కౌంటర్
మే 18, 2026

Kishan Reddy | బండి భగీరథ్ లొంగిపోయాడు కదా.. ఇష్యూ ఏముంది..! : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మే 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



