త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | సవాల్ విసిరి పిరికిపందల్లా పారిపోయారు.. కాంగ్రెస్ మంత్రులపై తలసాని విమర్శలు

Talasani Srinivas Yadav | సవాల్ విసిరిన కాంగ్రెస్ మంత్రులు చివరకు పిరికిపందల్లా పారిపోయార‌ని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీశ్‌రావుతో పాటు అరెస్టయిన ఇతర పార్టీ నేతలను ఆయన పరామర్శించారు.

P

Telangana | Published On Jul 2, 2026, 3.49 pm IST

Talasani Srinivas Yadav | సవాల్ విసిరి పిరికిపందల్లా పారిపోయారు.. కాంగ్రెస్ మంత్రులపై తలసాని విమర్శలు
Advertisement

Talasani Srinivas Yadav | సవాల్ విసిరిన కాంగ్రెస్ మంత్రులు చివరకు పిరికిపందల్లా పారిపోయార‌ని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీశ్‌రావుతో పాటు అరెస్టయిన ఇతర పార్టీ నేతలను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల అప్పు చేసిందని, అయితే ఆ అప్పుతో ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పని కూడా చేయలేదని తలసాని ఆరోపించారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అద్భుతాలు సృష్టించారన్నారు. అధికార పార్టీ నాయకులు బూతులు మాట్లాడితే కేసులు నమోదు కావడం లేదని, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్న తమపై మాత్రం కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు వస్తుంటాయని, పోతుంటాయని, కానీ వ్యవస్థలు శాశ్వతమని పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించారు. కేసీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలు, జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తలసాని అన్నారు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు పొంతన లేకుండా పోయిందని విమర్శించారు.

మంత్రులే పిలిచినందుకే హరీశ్‌రావు గన్‌పార్క్ వద్దకు బయలుదేరారని, అలాంటి పరిస్థితిలో ఆయనను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రులకు నిజంగా దమ్ముంటే కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. అగ్రికల్చర్ శాఖలో పనిచేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణిని లూప్‌లైన్‌కు బదిలీ చేశారని ఆరోపించిన తలసాని, ఇది ప్రభుత్వం అనుకోవాలా.. సర్కస్ అనుకోవాలా అర్థం కావడం లేదు" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం సర్కస్ కంపెనీలా వ్యవహరిస్తూ డ్రామాలు ఆడుతోందని, రాష్ట్రంలో నడుస్తోంది ప్రభుత్వం కాదని, సర్కస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement