త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venkataramana Reddy | విద్యార్థులు ఫీజు రీయింబ‌ర్స్ కోసం ఎదురుచూస్తున్న‌రు: ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి

Venkataramana Reddy | ఫీజు కట్టలేని పరిస్థితిలో సర్టిఫికెట్లు తెచ్చుకోలేక స్విగ్గీలో, జొమాటోలో విద్యార్థులు పనిచేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి ఆవేద‌న చెందారు. ఉన్నోడు.. లేనోడు.. అనే తేడా లేకుండా ప్రతి విద్యార్థికి ఉపయోగపడే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చార‌ని గుర్తు చేశారు.

S

Telangana | Published On Jun 6, 2026, 2.00 pm IST

Venkataramana Reddy | విద్యార్థులు ఫీజు రీయింబ‌ర్స్ కోసం ఎదురుచూస్తున్న‌రు: ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి
Advertisement

Venkataramana Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఫీజు కట్టలేని పరిస్థితిలో సర్టిఫికెట్లు తెచ్చుకోలేక స్విగ్గీలో, జొమాటోలో విద్యార్థులు పనిచేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి ఆవేద‌న చెందారు. 40 లక్షల మంది విద్యార్థులు ఐదేళ్లుగా ఫీజు రీయింబర్స్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఉన్నోడు.. లేనోడు.. అనే తేడా లేకుండా ప్రతి విద్యార్థికి ఉపయోగపడే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చార‌ని గుర్తు చేశారు. ఈమేర‌కు ఆయ‌న శ‌నివారం మాట్లాడుతూ పేద విద్యార్థుల‌కు చ‌దువులు అక్క‌ర‌లేదా అని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

40 ల‌క్ష‌ల మంది విద్యార్థుల ఎదురుచూపులు..

14 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. పేద విద్యార్థులకు చదువులు అక్కరలేదా? 40 లక్షల మంది విద్యార్థులు 5 ఏళ్లుగా ఫీజు రీయింబర్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉచిత సంక్షేమ పథకం మాదిరిగా ఫీజు రీయింబర్స్ పథకాన్ని చూడొద్దు. చాలా ఇంజినీరింగ్ కాలేజీలు మూత పడుతున్నాయి. డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి అని ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement
Advertisement