Talasani Srinivas Yadav | ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు బీఆర్ఎస్దే : తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా, రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినా, ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీనేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Talasani Srinivas Yadav | జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా, రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినా, ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీనేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల 14న ఖైరతాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు అయ్యేలా బూత్ స్థాయి ఏజెంట్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అలాగే ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిందా లేదా అనే విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి ప్రశ్నించాలని తలసాని సూచించారు. పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తున్న కార్యకర్తలకు బీఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. కష్టపడి పనిచేసే వారికే పార్టీలో సముచిత స్థానం, గుర్తింపు లభిస్తాయని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని తలసాని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని పెంచింది గులాబీ జెండానేనని పేర్కొన్నారు. పార్టీని వీడి వెళ్లిపోయిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి రానివ్వబోమని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మోసాలు, అబద్ధాలకు పెట్టింది పేరని విమర్శించిన ఆయన, ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి అసహనంగా స్పందిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసినా వాటిని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించిందని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఆ నిధులను ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తలసాని అన్నారు. రాష్ట్రంలో "కాంగ్రెస్ పోవాలి... కేసీఆర్ రావాలి" అనే భావన ప్రజల్లో పెరుగుతోందని పేర్కొన్నారు. మరో రెండున్నర సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు అయినా, అసెంబ్లీ ఎన్నికలు అయినా, ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానేనని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Phone Tapping Case | అధికార దుర్వినియోగంలో కేసీఆర్ని మించిన వారు లేరు : ఎంపీ చామల
జూన్ 6, 2026

Operation Kavach | 5వేల మందితో నగరంలో అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్.. పర్యవేక్షించిన సజ్జనార్
జూన్ 6, 2026

TIMS | త్వరలో టిమ్స్ను ప్రారంభించనున్న సీఎం.. ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి రాజనర్సింహ
జూన్ 6, 2026
తాజావార్తలు
- ●Rachita Ram | కూలీ లేడీ విలన్కు తెలుగులో ఛాన్స్ - మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ
- ●Sourav Ganguly | ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ..? ఇందుకోసం గంగూలీ సాయం కోరిన దీదీ..? క్లారిటీ ఇచ్చిన దాదా
- ●WhatsApp | వాట్సాప్లో మరో కొత్త ఫీచర్.. స్కామ్లను పసిగడుతుంది..
- ●WhatsApp Status Edit | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై పోస్ట్ చేసిన 'స్టేటస్'ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు!
- ●Phone Tapping Case | అధికార దుర్వినియోగంలో కేసీఆర్ని మించిన వారు లేరు : ఎంపీ చామల
- ●RTC Union Elections | జులైలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు..!

Rachita Ram | కూలీ లేడీ విలన్కు తెలుగులో ఛాన్స్ - మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ

Sourav Ganguly | ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ..? ఇందుకోసం గంగూలీ సాయం కోరిన దీదీ..? క్లారిటీ ఇచ్చిన దాదా

WhatsApp | వాట్సాప్లో మరో కొత్త ఫీచర్.. స్కామ్లను పసిగడుతుంది..

WhatsApp Status Edit | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై పోస్ట్ చేసిన 'స్టేటస్'ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు!



