త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | జూరాల ప్రాజెక్టు నుంచి ప్ర‌ధాన కాలువలకు త‌క్ష‌ణ‌మే నీటిని విడుదల చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud | జూరాల ప్రాజెక్టు (Jurala project) కుడి, ఎడ‌మ ప్ర‌ధాన కాలువ‌ల‌కు త‌క్ష‌ణ‌మే నీటిని విడుద‌ల చేయాల‌ని మాజీ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు.

G

Telangana | Published On Jul 29, 2026, 12.23 pm IST

Srinivas Goud | జూరాల ప్రాజెక్టు నుంచి ప్ర‌ధాన కాలువలకు త‌క్ష‌ణ‌మే నీటిని విడుదల చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Advertisement

Srinivas Goud | త్రినేత్ర‌.న్యూస్‌: జూరాల ప్రాజెక్టు (Jurala project) కుడి, ఎడ‌మ ప్ర‌ధాన కాలువ‌ల‌కు త‌క్ష‌ణ‌మే నీటిని విడుద‌ల చేయాల‌ని మాజీ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. గ‌త నాలుగు రోజులుగా ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద వ‌స్తున్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పాలమూరు రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి కర్కశంగా వ్యవహరిస్తున్న‌దని మండిప‌డ్డారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 7.12 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, సుమారు 20 వేల‌ క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్న‌ది. అయినా వచ్చిన నీటిని జూరాల కుడి, ఎడమ ప్రధాన కాలువలకు (Jurala Canals) విడుదల చేయకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు విడుదల చేయడం వల్ల పాలమూరు రైతులు సాగునీటికి దూరమవుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రైతుల అవసరాలను పక్కనపెట్టి శ్రీశైలానికి Srisailam) నీటిని విడుదల చేస్తుందని, తద్వారా ఆ నీరు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే మార్గాన్ని రేవంత్ రెడ్డి ( Revanth Reddy) సుగమం చేశాడని విమర్శించారు. త‌క్ష‌ణ‌మే జూరాల కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేసి పాలమూరు రైతుల సాగు అవసరాలను తీర్చాలని బీఆర్ఎస్ (BRS) పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మంచి మాటతో కాలువలకు నీటిని విడుదల చేయాల‌ని, లేన‌ట్ల‌యితే గురువారం (జూలై 30న‌) వేలాది మంది రైతులతో కలిసి జూరాల ప్రాజెక్టును ముట్టడించి, కాలువలకు నీటిని విడుదల చేసే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement