త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

South Central Railway | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. 132 ప్ర‌త్యేక రైళ్ల‌ను పొడిగించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..!

South Central Railway | ప్ర‌యాణీకుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో నడుస్తున్న వారపు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించింది. సెప్టెంబర్‌ వరకు మొత్తం 132 సర్వీసులను కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

P

Telangana | Published On Jun 1, 2026, 5.52 pm IST

South Central Railway | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. 132 ప్ర‌త్యేక రైళ్ల‌ను పొడిగించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..!
Advertisement

South Central Railway | ప్ర‌యాణీకుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో నడుస్తున్న వారపు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించింది. సెప్టెంబర్‌ వరకు మొత్తం 132 సర్వీసులను కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్‌–నహర్‌లగన్‌, చర్లపల్లి–సంత్రగచ్చి, హైదరాబాద్‌ డెక్కన్‌–కొల్లం, సికింద్రాబాద్‌–శ్రీకాకుళం రోడ్‌, జాల్నా–తిరుపతి మార్గాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను కొన‌సాగిస్తున్నామ‌ని, ర‌ద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివ‌రించారు.

సికింద్రాబాద్‌–నహర్‌లగన్‌ ప్రత్యేక రైలు (07046) జూలై 3 నుంచి సెప్టెంబర్‌ 25 వరకు ప్రతి శుక్రవారం నడవనుండగా, తిరుగు ప్ర‌యాణంలో రైలు (07047) జూలై 6 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉండ‌నునంది. చర్లపల్లి–సంత్రగచ్చి (07221) రైలు జూలై 4 నుంచి సెప్టెంబర్‌ 26 వరకు ప్రతి శనివారం, తిరుగు ప్ర‌యాణంలో రైలు (07222) జూలై 5 నుంచి సెప్టెంబర్‌ 27 వరకు ప్రతి ఆదివారం రాక‌పోక‌లు సాగిస్తుంది. హైదరాబాద్‌ డెక్కన్‌–కొల్లం (07193) రైలు జూలై 4 నుంచి సెప్టెంబర్‌ 26 వరకు శనివారాల్లో, తిరుగు మార్గంలో రైలు (07194) జూలై 6 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు సోమవారాల్లో న‌డుస్తుంద‌ని అధికారులు తెలిపారు.

ఇక సికింద్రాబాద్‌–శ్రీకాకుళం రోడ్‌ (07425) ప్రత్యేక రైలు జూలై 5 నుంచి సెప్టెంబర్‌ 27 వరకు ఆదివారాల్లో నడువ‌నుండ‌గా..తిరుగు ప్ర‌యాణంలో రైలు (07426) జూలై 6 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు సోమవారాల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే, జాల్నా–తిరుపతి (07814) రైలు జూలై 2 నుంచి సెప్టెంబర్‌ 24 వరకు ప్రతి గురువారం, తిరుగు ప్ర‌యాణంలో రైలు (07815) జూలై 3 నుంచి సెప్టెంబర్‌ 25 వరకు ప్రతి శుక్రవారం రాక‌పోక‌లు సాగిస్తుంది. ప్రయాణికుల రద్దీని నియంత్రించడంతో పాటు అదనపు సౌకర్యం కల్పించేందుకు ప్ర‌త్యేక రైళ్ల‌ను పొడిగిస్తున్న‌ట్లు చెప్పింది.

Advertisement
Advertisement