Special Trains | ప్రయాణీకులకు గుడ్న్యూస్.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Special Trains | సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు ఆది, సోమవారాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. చర్లపల్లి -కాకినాడ టౌన్-చర్లపల్లి, చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి, విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది.
Special Trains | సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు ఆది, సోమవారాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. చర్లపల్లి -కాకినాడ టౌన్-చర్లపల్లి, చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి, విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది.
చర్లపల్లి-కాకినాడ టౌన్ (07480) రైలు ఈ నెల 19న అందుబాటులో ఉంటుంది. ఉదయం 10 గంటలకు బయలుదేరి.. అదే రోజు రాత్రి 9.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. కాకినాడ టౌన్ (07481) రైలు 19న రాత్రి 11.15 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.
ఇక చర్లపల్లి-తిరుపతి (07482) నంబరు గల ప్రత్యేక రైలు 18న ఉదయం 4 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 7 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. తిరుపతి-చర్లపల్లి (07483) నంబరు గల రైలు తిరుగు ప్రయాణంలో రాత్రి 9.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు మధ్యస్థానం చేరుకుంటుంది. ఈ రైలు జనగామ, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నక్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఇక విశాఖపట్నం-చర్లపల్లి (08517) రైలు 18న మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. చర్లపల్లి-విశాఖపట్నం (08518) రైలు 19న ఉదయం 9 గంటలకు బయలుదేరి మరుసటిరోజు అర్ధరాత్రి 12.30గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






