Phone Tapping | సిట్ దూకుడు.. కేటీఆర్కు నోటీసులు
Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సిట్ (CIT) తన దూకుడును కొనసాగిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని సూచించింది.
Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సిట్ (CIT) తన దూకుడును కొనసాగిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు నందినగర్లోని నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు సిట్ ఎదుట విచారణకు హాజరుకావాలని సూచించారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ (Sajjanar) ను సిట్ చీఫ్గా నియమిస్తూ, మరికొంత మంది అధికారులను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. అనంతరం కేసు విచారణలో వేగం పెరిగింది. రెండు రోజుల క్రితమే మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ను ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు (Prabhakar Rao) ను సుప్రీం కోర్టు తీర్పు మేరకు రెండు వారాల పాటు సిట్ కస్టోడియల్ విచారణ నిర్వహించింది. అనంతరం ఎమ్మెల్సీ నవీన్రావును సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఎమ్మెల్సీ నవీన్రావు తండ్రి కొండల్రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనయుడు సందీప్రావులను సైతం విచారించింది. అనంతరం సిట్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, చిరుమర్తి లింగయ్యలతో పాటు సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.
మూడు రోజుల క్రితం సింగరేణి కుంభకోణం అంశాన్ని హరీశ్రావు బహిర్గతం చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్రావుకు సిట్ నోటీసులు జారీ చేసి సుదీర్ఘంగా విచారణ జరిపింది. అదే క్రమంలో తాజాగా కేటీఆర్కు నోటీసులు పంపింది. ప్రభాకర్రావు విచారణ అనంతరం దీనికి సంబంధించిన నివేదికను ఈ నెలాఖరులోపే కోర్టుకు సమర్పించాల్సిన నేపథ్యంలో సిట్ విచారణ వేగవంతం చేయడం ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



