Singareni | సింగరేణికి కొత్త సీఎండీ.. ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధ ప్రకాశ్కి బాధ్యతలు
Singareni | సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL).. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 3 లక్షల మందికిపైగా కార్మికులు, వేలాది మంది అధికారులు ఉన్న అతిపెద్ద బొగ్గుగని. ఉద్యోగాల గని పేరొందిన సింగరేణి (Singareni) ఇటీవల తరచూ అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నది.
Singareni | త్రినేత్ర.న్యూస్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL).. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 3 లక్షల మందికిపైగా కార్మికులు, వేలాది మంది అధికారులు ఉన్న అతిపెద్ద బొగ్గుగని. ఉద్యోగాల గని పేరొందిన సింగరేణి (Singareni) ఇటీవల తరచూ అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నది. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. అపర బొగ్గు నిల్వలు చేతుల్లో ఉన్నా పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోతున్న ఈ సంస్థకు నూతన సీఎండీని (CMD) ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్కు (Dr. Jyoti Buddha Prakash) సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఇన్-చార్జి బాధ్యతలు నిర్వహించిన కృష్ణ భాస్కర్ను ఆ బాధ్యతల నుండి తప్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అప్పటివరకు సింగరేణి సీఎండీగా ఎన్.శ్రీధర్ను ఆ విధుల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో కేంద్ర రెవెన్యూ సర్వీసు నుంచి డిప్యుటేషన్పై వచ్చిన బలరామ్ను నియమించింది. సింగరేణిలో సంచాలకుడిగా, ఇన్చార్జి సీఎండీగా మొత్తం ఆరేళ్ల పాటు పదవీకాలం ముగియడంతో తిరిగి ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. దీంతో గతేడాది డిసెంబర్లో సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
అయితే సింగరేణి ఆర్థిక పరిస్థితి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయిలో సీఎండీని నియమించాలని భావించిన ప్రభుత్వం 2002 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధ ప్రకాశ్కు ఆ బాధ్యతలు అప్పగించింది.
సింగరేణి ప్రస్తుతం ఆర్థికంగా సంకట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. డిస్కంల నుంచి రూ.23 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఉద్యోగుల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు నెలనెలా బ్యాంకుల నుంచి ‘ఓవర్డ్రాఫ్ట్’(ఓడీ)పై డబ్బు తీసుకుని నెట్టుకొస్తున్నది. అయితే ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. అప్పులు తెచ్చి కొత్తగా రూ.11 వేల కోట్ల వ్యయంతో మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు నిర్మాణం చేపట్టింది.
ఒడిశాలోని నైనీ గని వద్ద కొత్తగా బొగ్గు తవ్వకాలు ప్రారంభించింది. దానికి సమీపంలోనే రూ.25 వేల కోట్ల వ్యయంతో 1600 మెగావాట్ల థర్మల్ కేంద్రం నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే నైనీ గనిపై ఇటీవల దుమారం రేగిన విషయం తెలిసిందే. బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో ఇద్దరు మంత్రులు పెద్దమొత్తం అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బొగ్గుగని తవ్వకాలకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



