Self Enumeration | రేపటితో ముగియనున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్
Self Enumeration | రాష్ట్రంలో జనగణన (Census) కొనసాగుతున్నది. ఆదివారం (మే 10)తో తొలివిడతలో భాగంగా చేపట్టిన స్వీయగణన (Self Enumeration) ముగియనుంది. దీంతో ప్రజలు తమ వివరాలను జనాభా లెక్కల పోర్టల్ https://se.census.gov.inలో నమోదుచేసుకోవాలని అధికారులు సూచించారు.
Self Enumeration | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో జనగణన (Census) కొనసాగుతున్నది. ఆదివారం (మే 10)తో తొలివిడతలో భాగంగా చేపట్టిన స్వీయగణన (Self Enumeration) ముగియనుంది. దీంతో ప్రజలు తమ వివరాలను జనాభా లెక్కల పోర్టల్ https://se.census.gov.inలో నమోదుచేసుకోవాలని అధికారులు సూచించారు. గత నెల 25న రాష్ట్రంలో స్వీయ గణన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు స్వీయగణన పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. దీని తర్వాత రెండో దశలో ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు మిగితా 6 ప్రశ్నలకు వివరాలు చెప్పాల్సి ఉంటుంది. దేశంలో ఎక్కడ ఉన్నా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవచ్చన్నారు. కాగా, తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న జనాభా లెక్కలు ఇవే మొదటిసారి కావడం గమనార్హం.
తొలివిడతలో ఇండ్లకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తారు. మే 11 నుంచి జూన్ 19 వరకు నివాసాలపై మార్కింగ్ చేస్తారు. జనగణన కోసం 1855 నంబర్తో హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. ఈ సేవలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటాయి.

జనగణనలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. అయితే స్వీయ గణనలో భాగంగా 27 ప్రశ్నలకు జవాబులను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 6 ప్రశ్నలకు సమాధానాలను ఇంటి వద్దకు వచ్చే ఎన్యుమరేటర్ (Enumerators) నమోదు చేస్తారు. ఎన్ని ఆస్తులున్నాయి?, ఎక్కడెక్కడ ఉన్నాయనే ప్రశ్నలు లాంటివి ఉండవు. ఇంటి నంబర్లు, ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాల ప్రస్తావన ఉండదు. ఇల్లు, సౌకర్యాలు, కులం తదితర వివరాలను మాత్రమే తెలపాల్సి ఉంటుంది. మొదటి దశలో కేవలం ఎస్సీ (షెడ్యూల్డ్ క్యాస్ట్), ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్) కులాల నమోదు ఉంటుంది. ఆ రెండు కేటగిరీల్లో లేని వారిని ఇతరులుగా పరిగణిస్తారు. ‘ఇతరుల’ కులాన్ని రెండో దశ జనగణనలో నమోదు చేస్తారు. జనగణన అధికారులు ఇంటికి వచ్చి అడిగే సాధారణ ప్రశ్నలకూ సమాధానమివ్వనట్లయితే చట్ట ప్రకారం జరిమానా విధింపు, ఇతర చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



