త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు

తెలంగాణలో సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేట్ భూములతో రైతులు, రియల్ ఎస్టేట్ వర్గాలు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం ఏంటి? పూర్తి వివరాలివే.

J

Telangana | Published On Aug 11, 2026, 10.30 pm IST

Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు

సంక్షిప్త సారాంశం

తెలంగాణలో సెక్షన్ 22A (నిషేధిత జాబితా) భూముల సమస్యలపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కీలక రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. 3TV నెట్‌వర్క్, సకలం వెబ్ పత్రిక ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో రియల్ ఎస్టేట్ నిపుణులు, డెవలపర్లు పాల్గొన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డుల్లో తప్పుల వల్ల పూర్తి అర్హత ఉన్న ప్రైవేట్ భూములు కూడా 22A లిస్ట్‌లో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 98 (GO Ms No.98) కింద ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ విధానాన్ని మరింత సులభతరం చేసి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Section 22A lands Telangana | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సెక్షన్ 22A భూముల సమస్యలపై ఒక ముఖ్యమైన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. 3TV నెట్‌వర్క్, సకలం వెబ్ పత్రికల సంయుక్త ఆధ్వర్యంలో.. చీఫ్ ఎడిటర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. ఇందులో పలువురు రియల్ ఎస్టేట్ (Real Estate) ప్రముఖులు, ప్రాపర్టీ డెవలపర్లు, నిపుణులు పాల్గొని నిషేధిత భూముల (Prohibited lands) జాబితాతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై సమగ్రంగా చర్చించారు.

అసలు సమస్య ఎక్కడ వస్తోంది?

రాష్ట్రంలో సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో చేరిన భూముల కారణంగా అటు రైతులు (Farmers), ఇటు భూయజమానులు, రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని సమావేశంలో ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖల రికార్డుల మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోవడం వల్లే ఎన్నో సమస్యలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. రికార్డుల్లో దొర్లుతున్న చిన్న చిన్న టెక్నికల్ తప్పుల కారణంగా.. క్రయవిక్రయాలకు పూర్తి అర్హత ఉన్న ప్రైవేటు పట్టా భూములు (Private Lands) కూడా పొరపాటున 22A జాబితాలో పడిపోతున్నాయని నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు.

శాశ్వత పరిష్కారం చూపాలి

ఈ సమస్యకు ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. అర్హత ఉన్న ప్రైవేటు భూములను వెంటనే గుర్తించి.. వాటిని 22A లిస్ట్ నుంచి తొలగించే (Delete) ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులను పక్కాగా ఇంటిగ్రేట్ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

గ్రీవెన్స్ సిస్టమ్ సింపుల్‌గా ఉండాలి

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ 22A భూముల సమస్యల పరిష్కారం కోసమే GO Ms No.98 ద్వారా ఒక హై-లెవెల్ కమిటీని, ప్రత్యేక గ్రీవెన్స్ మెకానిజాన్ని (Grievance mechanism) ఏర్పాటు చేసింది. అయితే, ఈ ప్రాసెస్ సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా.. మరింత సరళీకృతంగా (Simplified) మార్చాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ప్రభుత్వానికి సూచించారు.

Advertisement
Advertisement