త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Coal Mines | తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్: సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించండి

తెలంగాణ విద్యుత్ అవసరాలు తీరాలంటే సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించాల్సిందేనని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

J

Telangana | Published On Aug 11, 2026, 8.47 pm IST

Telangana Coal Mines | తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్: సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించండి

సంక్షిప్త సారాంశం

తెలంగాణ విద్యుత్ అవసరాల దృష్ట్యా సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు బ్లాకులు (Coal Blocks) కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. ప్రస్తుతం ఉన్న గనుల్లో 2032-33 నాటికి 22 గనులు మూతపడతాయని.. దీనివల్ల ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. వేలం వేసినా పనులు ప్రారంభించని కోయగూడెం-III, సత్తుపల్లి-III బ్లాకులను సింగరేణికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. అదనపు ఆదాయం చెల్లించేందుకు కూడా సింగరేణి సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.

Advertisement
  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

Telangana Coal Mines | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు కొత్త బొగ్గు బ్లాకులను (Coal Blocks) కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక లేఖ రాశారు.

సింగరేణి ఉత్పత్తి.. రాబోయే సవాళ్లు

తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్న సింగరేణి సంస్థ, ప్రస్తుతం ఏడాదికి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోందని సీఎం లేఖలో గుర్తుచేశారు. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 43 వేల మంది, పరోక్షంగా లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. అయితే, 2032-33 నాటికి 22 గనులు మూతపడాల్సి ఉందని, అప్పుడు సింగరేణి ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పడిపోతుందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్త ప్రాజెక్టులకు బొగ్గు అవసరం ఎంతో ఉంది

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ (Power Demand) అంతకంతకూ పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకు 4,000 మెగావాట్ల 'యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్' నిర్మాణంలో ఉందని, రామగుండంలో మరో 4,000 మెగావాట్ల NTPC ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ రెండు ప్లాంట్లు నడవాలంటే సుమారు 40 MTPA బొగ్గు అదనంగా అవసరం పడుతుందని సీఎం మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

ఆ బ్లాకులు సింగరేణికే ఇవ్వండి

కోయగూడెం బ్లాక్-III, సత్తుపల్లి బ్లాక్-III లను వేలం (Auction) ద్వారా ఇతర సంస్థలకు కేటాయించినప్పటికీ.. వారు ఇప్పటివరకు పనులు మొదలుపెట్టలేదని సీఎం తెలిపారు. కాబట్టి ఆ రెండు బ్లాకులను MMDR Act చట్టం కింద సింగరేణికి అప్పగించాలని కోరారు. కావాలంటే, వీటి ద్వారా వచ్చే ఆదాయం కంటే అదనంగా 0.5 శాతం చెల్లించేందుకు సింగరేణి సిద్ధంగా ఉందన్నారు.

అదేవిధంగా, శ్రావణపల్లి బ్లాక్‌ను త్వరలో జరగబోయే వేలం నుంచి తప్పించి, నేరుగా సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు PK OC-II డిప్‌సైడ్ బ్లాక్, గోదావరి వ్యాలీలో గుర్తించిన మరికొన్ని బ్లాకులను కూడా సింగరేణి సంస్థకే ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement
Advertisement