త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Chamala Kiran Kumar Reddy | కోవర్టుల వల్లే అక్కడ ఓడాం.. రేవంత్ రెడ్డే పదేళ్లు సీఎం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంటుందని, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. సొంత పార్టీలోని కోవర్టులు, కేసీఆర్ ఫాంహౌస్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

J

Telangana | Published On Feb 18, 2026, 10.30 pm IST

MP Chamala Kiran Kumar Reddy | కోవర్టుల వల్లే అక్కడ ఓడాం.. రేవంత్ రెడ్డే పదేళ్లు సీఎం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement

MP Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : ఇటీవల వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమపై మరింత బాధ్యతను పెంచాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల ఫలితాలు, పార్టీలోని అంతర్గత లోపాలు, మాజీ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ఒకసారి అధికారం ఇస్తే పదేళ్లు కొనసాగిస్తారని, 2033 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

నాయకులు కోవర్టులుగా మారారు

తన పార్లమెంట్ పరిధిలోని చేర్యాల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఓటమిపై చామల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "అక్కడ నాయకులకు, కార్యకర్తలకు మధ్య గ్యాప్ వచ్చింది. కొంతమంది నాయకులు ప్రత్యర్థి పార్టీలకు కోవర్టులుగా మారారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కలిసి పోస్ట్ మార్టం నిర్వహిస్తాం. రిపోర్ట్ తెప్పించుకొని, ఓటమికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అప్పుడే పార్టీ బాగుపడుతుంది" అని ఆయన హెచ్చరించారు.

కేసీఆర్ లక్కీ నెంబర్ 6.. అందుకే ఆరుసార్లు ఓడారు

మాజీ సీఎం కేసీఆర్‌పై ఎంపీ చామల సెటైర్లు వేశారు. కేసీఆర్ కవి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ లాంటి వారన్నారు. "కృష్ణశాస్త్రి తన బాధను లోకం బాధగా ఎలా చెప్పుకునేవారో.. కేసీఆర్ కూడా తన బాధలన్నీ ప్రజల బాధలు అనుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం ఆయన్ను ఫాంహౌస్‌కే పరిమితం చేశారు. 2023 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఆరుసార్లు ఘోరంగా ఓటమిపాలయ్యారు. బహుశా కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు అనుకుంటా.. అందుకే వరుసగా ఓడిపోతున్నారు" అని ఎద్దేవా చేశారు. కీలకమైన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రత్యక్ష పాత్ర పోషించకుండా ఫాంహౌస్‌లో పడుకున్నారని విమర్శించారు.

2033 వరకు రేవంత్ రెడ్డే సీఎం

తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక నాయకుడికి ప్రజలు పదేళ్లు అధికారం కట్టబెడుతున్నారని చామల విశ్లేషించారు. "2023 నుంచి 2033 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. రాబోయే పదేళ్లు రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఉంటారు" అని స్పష్టం చేశారు.

కేటీఆర్ సవాళ్లు ట్విట్టర్‌కే పరిమితం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై కూడా చామల మండిపడ్డారు. కేటీఆర్ 'బస్తీ మే సవాల్' కేవలం సోషల్ మీడియా, ట్విట్టర్‌కు మాత్రమే పరిమితమని ఎలక్షన్‌లలో రుజువైందన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారానికి జనం లొంగలేదని, అందుకే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి 'సున్నా' (Zero) వచ్చిందని ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement