Thummala Nageswara Rao | రైతు భరోసా నిధుల విడుదలలో రేవంత్ ప్రభుత్వం రికార్డు : మంత్రి తుమ్మల
Thummala Nageswara Rao | రైతుభరోసా నిధుల విడుదలలో రేవంత్ ప్రభుత్వం మరోసారి రికార్డు సాధించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్ 30న ప్రారంభమైన రైతుభరోసా నిధుల పంపిణీ కార్యక్రమం కేవలం నాలుగు రోజుల్లోనే రూ.6,590.37 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.
Thummala Nageswara Rao | రైతుభరోసా నిధుల విడుదలలో రేవంత్ ప్రభుత్వం మరోసారి రికార్డు సాధించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్ 30న ప్రారంభమైన రైతుభరోసా నిధుల పంపిణీ కార్యక్రమం కేవలం నాలుగు రోజుల్లోనే రూ.6,590.37 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు నాలుగో విడతలో భాగంగా 4 నుంచి 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,188 కోట్లను నేరుగా జమ చేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ విడతలో మొత్తం 4.41 లక్షల మంది రైతులు రైతుభరోసా సాయం పొందారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి మూడు విడతల్లో 4 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సాయం అందించగా, ఇప్పుడు ఆ పరిధిని విస్తరించి 4 నుంచి 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ నిధులు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ఇప్పటివరకు రైతుభరోసా పథకం కింద మొత్తం 65.76 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.5,402.37 కోట్ల సాయం ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ రోజు విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం సాయం రూ.6,590.37 కోట్లకు చేరినట్లు ఆయన స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
జులై 18, 2026

Power Demand | ఎల్నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 18, 2026

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
జులై 18, 2026
తాజావార్తలు
- ●Maha Padayatra | రిజర్వాయర్లు నింపండి.. అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ వరకు రైతుల మహాపాదయాత్ర.. వీడియో
- ●Ration | మరోసారి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి.. ఆగస్టు 1 నుంచి పంపిణీ..
- ●Parliament Session | రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. మళ్లీ సభ ముందుకు ఆ రెండు బిల్లులు!
- ●Amarnath Yatra | భక్తులు రావొద్దు.. అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. మళ్లీ ఎప్పుడంటే?
- ●MBBS | ఎంబీబీఎస్లో సీనియర్ సిటిజన్లకు రిజర్వేషన్లు ఎందుకు లేవు?.. హైకోర్టును ఆశ్రయించిన 71 ఏండ్ల నీట్ అభ్యర్థి
- ●Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

Maha Padayatra | రిజర్వాయర్లు నింపండి.. అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ వరకు రైతుల మహాపాదయాత్ర.. వీడియో

Ration | మరోసారి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి.. ఆగస్టు 1 నుంచి పంపిణీ..

Parliament Session | రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. మళ్లీ సభ ముందుకు ఆ రెండు బిల్లులు!

Amarnath Yatra | భక్తులు రావొద్దు.. అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. మళ్లీ ఎప్పుడంటే?



