త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vardhannapeta | మార్చురీలో శ‌వాన్ని పీక్క‌తిన్న ఎలుక‌లు.. ఎక్క‌డో తెలుసా..?

Vardhannapeta | రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు నిర్ల‌క్ష్యానికి గుర‌వుతున్నాయి. మౌలిక స‌దుపాయాలు లేక‌పోవ‌డంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివ‌ర‌కు మార్చురీలో ఉంచిన శ‌వాల‌ను ఎలుక‌లు పీక్క‌తింటున్న ఘ‌ట‌న వెలుగు చూసింది.

S

Telangana | Published On Sep 20, 2026, 1.06 pm IST

Vardhannapeta | మార్చురీలో శ‌వాన్ని పీక్క‌తిన్న ఎలుక‌లు.. ఎక్క‌డో తెలుసా..?
Advertisement

Vardhannapeta | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు నిర్ల‌క్ష్యానికి గుర‌వుతున్నాయి. మౌలిక స‌దుపాయాలు లేక‌పోవ‌డంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివ‌ర‌కు మార్చురీలో ఉంచిన శ‌వాల‌ను ఎలుక‌లు పీక్క‌తింటున్న ఘ‌ట‌న వెలుగు చూసింది.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని వ‌ర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం ఓ మృత‌దేహాన్ని త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో మార్చురీలో శ‌వాన్ని భ‌ద్ర‌ప‌రిచారు. పోస్టుమార్టం పూర్తి కాక‌ముందే.. డెడ్‌బాడీని ఎలుక‌లు పీక్క‌తిన్నాయి. మృతుడు గౌరె వీర‌య్య కంటి భాగంలో ఎలుక‌లు కొరికిన ఆన‌వాళ్లు క‌నిపించ‌డంతో.. కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రి సిబ్బందిపై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. ఫ్రీజర్ లాంటి కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో లేవని మండిప‌డ్డారు.

Advertisement
Advertisement