త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shabad Current Shock Death | కరెంట్ షాక్‌తో బాలుడు మృతి.. లైన్‌మెన్ నిర్లక్ష్యమే కారణమా?

షాబాద్‌లో దారుణం.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ చేస్తూ కరెంట్ షాక్‌తో 17 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

J

Telangana | Published On Jun 29, 2026, 6.45 pm IST

Shabad Current Shock Death | కరెంట్ షాక్‌తో బాలుడు మృతి.. లైన్‌మెన్ నిర్లక్ష్యమే కారణమా?
Advertisement
  • రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో విషాదం
  • ధ్యానహిత స్కూల్ వద్ద కరెంట్ షాక్‌తో 17 ఏళ్ల బాలుడి మృతి
  • మైనర్ చేత ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ చేయించిన లైన్‌మెన్, అసిస్టెంట్ లైన్‌మెన్
  • విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు

Shabad Current Shock Death | త్రినేత్ర.న్యూస్ : రంగారెడ్డి (Rangareddy) జిల్లా షాబాద్ మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి 17 ఏళ్ల ఓ మైనర్ బాలుడు బలయ్యాడు. ధ్యానహిత స్కూల్ (Dhyanahita School) సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి (Electrocution) యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

అసలేం జరిగిందంటే

షాబాద్‌లో ఓ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు గురైంది. దాన్ని స్వయంగా బాగు చేయాల్సిన లైన్‌మెన్ (Lineman), అసిస్టెంట్ లైన్‌మెన్ తమ బాధ్యతను గాలికి వదిలేశారు. కనీస అవగాహన లేని ఓ 17 ఏళ్ల బాలుడిని పంపి అత్యంత ప్రమాదకరమైన ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు (Repair work) చేయించారు.

స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన మైనర్

ఈ క్రమంలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ షాక్ (Current Shock) కొట్టడంతో ఆ బాలుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. కళ్లెదుటే జరిగిన ఈ దారుణాన్ని చూసి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాధ్యత గల అధికారులు ఇలా ఓ చిన్న పిల్లాడిని కరెంట్ పనులకు పంపడం ఏంటని, విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయిందని గ్రామస్తులు మండిపడుతున్నారు.

పోలీసులకు సమాచారం

ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసే పనిలో పడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement