త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rama Nandana | ఉద్యోగాల పేరుతో మోసం ఆరోప‌ణ‌లు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యూట్యూబర్‌ నందన అరెస్ట్‌

Rama Nandana | లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ తెలుగు యూట్యూబర్‌ రమా నందనను ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై గతంలో లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోగానే ఆర్జీఐఏ పోలీసులు నందనను అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.

P

Telangana | Published On Sep 7, 2026, 3.18 pm IST

Rama Nandana | ఉద్యోగాల పేరుతో మోసం ఆరోప‌ణ‌లు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యూట్యూబర్‌ నందన అరెస్ట్‌
Advertisement

Rama Nandana | లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ తెలుగు యూట్యూబర్‌ రమా నందనను ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై గతంలో లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోగానే ఆర్జీఐఏ పోలీసులు నందనను అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నందనతో పాటు ఆమె భర్త జగర్లమూడి మధుకర్‌, ఆమె మామ మోహన్‌రావును నిందితులుగా పేర్కొన్నారు. లండన్‌లో ఉద్యోగం, యూకే వీసా పొడిగింపు, సర్టిఫికెట్‌ ఆఫ్‌ స్పాన్సర్‌షిప్‌ (CoS) ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

రూ.15 లక్షలు మోసపోయాన‌ని ఫిర్యాదు..

మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. వీసా పొడిగింపు, ఉద్యోగం, సీవోఎస్ (CoS) కోసం పలు విడతల్లో మొత్తం రూ.15 లక్షలను డెస్టినీ కన్సల్టెన్సీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు తెలిపారు. అయితే హామీ ఇచ్చిన సేవలను అందించలేదని.. తనకు అందజేసిన సీవోఎస్ డాక్యుమెంట్‌ సైతం నకిలీదని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ రూ.2 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు జగర్లమూడి మధుకర్‌ను ఏ1గా, రమా నందనను ఏ2గా, మోహన్‌రావును ఏ3గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అనంతరం నందనపై లుక్‌ఔట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

ఆరోపణలను ఖండించిన నందన

తనపై వచ్చిన ఆరోపణలను రమా నందన గతంలోనే ఖండించారు. తాను గానీ, తన భర్త గానీ డెస్టినీ కన్సల్టెన్సీని నిర్వహించడం లేదని ఆమె స్పష్టం చేశారు. తమ పేర్లను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో తనను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ నందన, ఆమె భర్త హైకోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా శంషాబాద్‌ విమానాశ్రయంలో నందనను ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.

Advertisement
Advertisement