త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Droupadi Murmu | రామోజీ ఫిల్మ్ సిటీని సంద‌ర్శించిన రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

Droupadi Murmu  | శీతాకాల విడిది కోసం హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చిన రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీని సంద‌ర్శించారు.

S

Telangana | Published On Dec 19, 2025, 12.03 pm IST

Droupadi Murmu | రామోజీ ఫిల్మ్ సిటీని సంద‌ర్శించిన రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము
Advertisement

Droupadi Murmu  | హైద‌రాబాద్ : శీతాకాల విడిది కోసం హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చిన రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీని సంద‌ర్శించారు. ఉద‌యం 9.30 గంట‌ల‌కు బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి నిల‌యం నుంచి బ‌య‌ల్దేరి 10.15 గంట‌ల‌కు ఫిల్మ్ సిటీకి ఆమె చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తికి ఘ‌న స్వాగ‌తం లభించింది.

అక్క‌డ ఏర్పాటు చేసిన ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్స్ చైర్‌ప‌ర్స‌న్‌ల నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌కు రాష్ట్ర‌ప‌తి ముఖ్య అతిథిగా హాజ‌రై స‌ద‌స్సును ప్రారంభించారు. కాన్ఫ‌రెన్స్‌ను ఉద్దేశించి ఆమె ప్ర‌సంగించారు. ఈ స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్లు ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌పై చ‌ర్చించ‌నున్నారు. పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ ఛైర్​పర్సన్​ల నేషనల్​ కాన్ఫరెన్స్ 2 రోజుల పాటు జరగనుండగా, రేపు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్​ హాజరుకానున్నారు. గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ, సీఎం రేవంత్​రెడ్డి కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం.

మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశాక భార‌త వాయుసేన‌కు సంబంధించిన ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో రాష్ట్ర‌ప‌తి తిరిగి బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి నిల‌యానికి చేరుకుంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. నో ఫ్లై, నో డ్రోన్​ జోన్​గా రాచకొండ సీపీ సుధీర్​బాబు ప్రకటించారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఉప్పల్​ మార్గంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ట్రాఫిక్​ ఆంక్షలు విధించనున్నారు. నాగోల్​, ఉప్పల్​, సర్వే ఆఫ్​ ఇండియా ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement