త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prajavani | ప్ర‌తి సోమ‌వారం జిల్లా, రెవెన్యూ డివిజ‌న్ స్థాయిలో ప్ర‌జావాణి

Prajavani | రాష్ట్ర స్థాయిలో రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని మ‌హాత్మా జ్యోతిబా పూలే ప్ర‌జా భ‌వ‌న్‌లో ప్ర‌తి మంగ‌ళ‌వారం, శుక్ర‌వారం ప్ర‌జావాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మాన్ని జిల్లా, రెవెన్యూ డివిజ‌న్ స్థాయికి విస్త‌రిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

S

Telangana | Published On Apr 30, 2026, 6.02 pm IST

Prajavani | ప్ర‌తి సోమ‌వారం జిల్లా, రెవెన్యూ డివిజ‌న్ స్థాయిలో ప్ర‌జావాణి
Advertisement

Prajavani | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర స్థాయిలో రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని మ‌హాత్మా జ్యోతిబా పూలే ప్ర‌జా భ‌వ‌న్‌లో ప్ర‌తి మంగ‌ళ‌వారం, శుక్ర‌వారం ప్ర‌జావాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మాన్ని జిల్లా, రెవెన్యూ డివిజ‌న్ స్థాయికి విస్త‌రిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి సోమవారం కలెక్టరేట్, రెవెన్యూ డివిజ‌న్‌ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఏకీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజాన్ని ఏర్పాటు చేసింది. క‌లెక్ట‌రేట్ స్థాయిలో నోడ‌ల్ అధికారిగా క‌లెక్ట‌ర్, రెవెన్యూ డివిజ‌న్ స్థాయిలో నోడ‌ల్ అధికారిగా స‌బ్ క‌లెక్ట‌ర్ లేదా రెవెన్యూ డివిజ‌న్ ఆఫీస‌ర్ నోడ‌ల్ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తారు. త్వ‌ర‌లోనే మండ‌ల స్థాయిలో కూడా ప్ర‌జావాణి నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకోనున్నారు.

30 రోజుల్లో ప‌రిష్కారం..

జిల్లా, రెవెన్యూ డివిజ‌న్ స్థాయిలో అందిన ఫిర్యాదుల‌ను త‌ప్పనిస‌రిగా ప్ర‌జావాణి పోర్ట‌ల్‌లో న‌మోదు చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్ర‌తి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయ‌డానికి వీలుగా ఫిర్యాదుదారుడికి ఒక ప్ర‌త్యేక రిఫరెన్స్ ఐడీతో కూడిన ర‌శీదును జారీ చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ఫిర్యాదును వీలైనంత త్వ‌ర‌గా లేదా 30 రోజుల్లో ప‌రిష్కారించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది.

Advertisement
Advertisement