త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో నేటితో ముగియ‌నున్న ప్ర‌భాక‌ర్‌రావు క‌స్ట‌డీ

Phone Tapping | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో తీవ్ర రాజ‌కీయ వివాదాలు రేపిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సిట్ పోలీసు క‌స్ట‌డీలో ఉన్న తెలంగాణ స్పెష‌ల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) (SIB) మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ (IPS) అధికారి ప్ర‌భాక‌ర్‌రావు (Prabhakar Rao) క‌స్ట‌డీ నేటితో ముగియ‌నుంది.

A

Telangana | Published On Dec 25, 2025, 2.53 pm IST

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో నేటితో ముగియ‌నున్న ప్ర‌భాక‌ర్‌రావు క‌స్ట‌డీ
Advertisement

ఇప్ప‌టికే పలువురిని విచారించిన సిట్‌

Phone Tapping | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో క‌స్టోడియ‌ల్ విచార‌ణ ఎదుర్కొంటున్న తెలంగాణ స్పెష‌ల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) (SIB) మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ (IPS) అధికారి టి. ప్రభాకర్‌రావు (Prabhakar Rao) క‌స్టోడియ‌ల్ విచార‌ణ నేటితో ముగియ‌నుంది. తాజాగా సిట్ (SIT) బృందం టాస్క్‌ఫోర్స్ (Task Force) మాజీ డీసీపీ రాధాకిష‌న్‌రావు, మాజీ అడిష‌న‌ల్ ఎస్పీ తిరుప‌త‌న్న‌, మీడియా సంస్థ అధినేత శ్ర‌వ‌ణ్‌రావును విచారిస్తోంది. రెండు రోజుల క్రిత‌మే మాజీ డీఎస్పీ ప్ర‌ణీత్ రావు, ప్ర‌భాక‌ర్‌రావుల‌ను క‌లిపి విచారించింది. ప్ర‌భాక‌ర్‌రావు పెద్ద కుమారుడు నిశాంత్‌రావును సైతం సిట్ విచార‌ణ జ‌రిపి, ఆయ‌న ఆర్థిక లావాదేవీల‌పై ప్ర‌శ్నించి, స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ప్రణీత్‌రావు మినహా మిగిలిన నిందితుల‌ను సిట్ విచారిస్తోంది.

ఆయ‌న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను పెండింగ్‌లో పెడుతూనే మే 29న ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచార‌ణ జ‌రిపిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల‌తో కూడిన ధర్మాసనం ప్ర‌భాక‌ర్‌రావును అరెస్టు చేయ‌కుండా గ‌తంలో ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను స‌వ‌రించింది. 12న ఉద‌యం 11 గంట‌ల క‌ల్లా కేసు ద‌ర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాల‌ని ఆదేశించింది. కస్టడీ విచారణ సమయంలో భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని దర్యాప్తు సంస్థకు స్పష్టం చేసింది. అతనికి అవసరమైన మందులు, కోరితే ఇంటి నుంచి ఆహారం అందించాలని సూచించింది. న్యాయ‌స్థానం ఆదేశంతో 12న ఉద‌యం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఆయ‌న లొంగిపోయారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ (Telangana)లో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించిన విష‌యం తెలిసిందే. అయితే దీనిపై ఈ నెల 19న మ‌రోసారి విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు క‌స్ట‌డీని మ‌రో వారం పొడ‌గించింది. ఆయ‌న‌ను డిసెంబ‌ర్ 26న పోలీస్ క‌స్ట‌డీ నుంచి విడుద‌ల చేయాల‌ని సిట్ అధికారుల‌ను ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకూడ‌ద‌ని నిర్దేశించింది.

మ‌రోవైపు ఈ కేసులో త్వ‌రలోనే మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR), మ‌రో ఇద్ద‌రు మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హ‌రీశ్‌రావు (Harish Rao) ల‌కు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. శీతాకాల అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన అనంత‌రం ఈ నోటీసులు ఇచ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే లీకులిచ్చింది.

Advertisement

తాజావార్తలు

Advertisement