త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | రాజ‌కీయ పార్టీలు రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్లే ఇలాంటి ఘ‌ట‌న‌లు.. శంక‌ర్ గౌడ్ మృతిప‌ట్ల మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ దిగ్భ్రాంతి

Ponnam Prabhakar | ఆర్టీసీ కార్మికులు అధైర్యపడవద్ద‌ని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతున్న‌ద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలుపుకోవ‌చ్చ‌ని తెలిపారు.

G

Telangana | Published On Apr 24, 2026, 9.50 am IST

Ponnam Prabhakar | రాజ‌కీయ పార్టీలు రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్లే ఇలాంటి ఘ‌ట‌న‌లు.. శంక‌ర్ గౌడ్ మృతిప‌ట్ల మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ దిగ్భ్రాంతి
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్టీసీ కార్మికులు అధైర్యపడవద్ద‌ని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతున్న‌ద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలుపుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఆవేశంలో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద‌ని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు నిరసనలకు మద్దతు ఇవ్వడం వల్ల అభ్యంతరం లేదు.. కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయ‌డం సరికాదని హిత‌వు ప‌లికారు.

రాజకీయ పార్టీల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. నేతలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైవర్ శంకర్ గౌడ్ (Shankar Goud) మృతి ద్రిగ్బ్రాంతికి గురిచేసింద‌ని, ఆయ‌న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంద‌ని తెలిపారు.

Advertisement
Advertisement