త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | గత 11 కేంద్ర బడ్జెట్ల‌లో తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం: మంత్రి పొన్నం

Ponnam Prabhakar | గ‌త 11 కేంద్ర బ‌డ్జెట్‌ల‌లో (Union Budget) తెలంగాణ‌కు (Telangana) తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చినందుకు అయినా ఈ సారి తెలంగాణ కు ఎక్కువ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి.

G

Telangana | Published On Jan 31, 2026, 5.19 pm IST

Ponnam Prabhakar | గత 11 కేంద్ర బడ్జెట్ల‌లో తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం: మంత్రి పొన్నం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: గ‌త 11 కేంద్ర బ‌డ్జెట్‌ల‌లో (Union Budget) తెలంగాణ‌కు (Telangana) తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చినందుకు అయినా ఈ సారి తెలంగాణ కు ఎక్కువ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి. ప్ర‌స్తుత బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం నిధులు కేటాయించేలా బీజేపీ (BJP) ఎంపీలు ఒత్తిడి తేవాల‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు, అత్యవరాలు ఏంటో ఇప్ప‌టికే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామ‌ని తెలిపారు. తెలంగాణపై ప్ర‌ధాని మోదీ చిన్న‌చూపు చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ఏర్పాటునే ప్ర‌ధాని వ్య‌తిరేకించార‌ని చెప్పారు. ఆర్ఆర్ఆర్, మెట్రో, డ్రై పోర్ట్, టెంపుల్ టూరిజం, విమానాశ్ర‌యాల‌కు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించాల‌న్నారు.

కేంద్ర పెద్దలను ఎప్పటికప్పుడు కలసి నివేదికలు ఇస్తున్నామ‌ని వెల్ల‌డించారు. అయినా నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతున్న‌ద‌ని చెప్పారు. పౌర్ణమి రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతున్న‌ద‌ని, తెలంగాణ‌కు వెలుగును ఇస్తుందా చీకటి ఇస్తుందో చూస్తామ‌ని తెలిపారు. ఆదివారం ప్ర‌వేశ‌పెట్టే బడ్జెట్ తెలంగాణ‌కు ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఈసారి బడ్జెట్‌లో అన్యాయం జరిగితే తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు భాధ్యత వహించాల‌న్నారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీకి కేంద్ర స‌హ‌క‌రించాల‌ని, పెండింగ్ ప్రాజెక్టుల‌కు కేంద్రం ఆమోదం తెల‌పాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement