త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medaram Jathara | మేడారంలో పోలీసుల అత్యుత్సాహం.. భ‌క్తుల‌పై లాఠీల‌తో దాడులు

Medaram Jathara | మేడారం మ‌హా జాత‌ర‌లో పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. భ‌క్తుల‌పై లాఠీల‌తో విరుచుకుప‌డ్డారు. దీంతో భ‌క్తుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. మొత్తంగా మేడారంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

S

Telangana | Published On Jan 30, 2026, 12.40 pm IST

Medaram Jathara | మేడారంలో పోలీసుల అత్యుత్సాహం.. భ‌క్తుల‌పై లాఠీల‌తో దాడులు
Advertisement

Medaram Jathara | త్రినేత్ర‌.న్యూస్ : మేడారం మ‌హా జాత‌ర‌లో పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. భ‌క్తుల‌పై లాఠీల‌తో విరుచుకుప‌డ్డారు. దీంతో భ‌క్తుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. మొత్తంగా మేడారంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పోలీసుల అత్యుత్సాహంపై భ‌క్తులు మండిప‌డ్డారు. భ‌క్తుల‌కు స‌రైన ఏర్పాట్లు చేయాల్సింది పోయి.. అర‌కొర ఏర్పాట్లు చేసి మ‌ళ్లీ త‌మ‌పై జులుం ప్ర‌ద‌ర్శించ‌డం ఏంట‌ని భ‌క్తులు నిల‌దీశారు. భ‌క్తుల‌పై లాఠీలు ఝులిపించిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఏటూరు నాగారం ఏఎస్పీ మ‌న‌న్ భ‌ట్, సీఐ ద‌యాక‌ర్ క‌లిసి భ‌క్తుల‌పై దాడి చేసిన‌ట్లు తెలిసింది.

[video width="848" height="478" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/01/WhatsApp-Video-2026-01-30-at-12.23.38-PM.mp4"][/video]

[video width="848" height="480" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/01/WhatsApp-Video-2026-01-30-at-12.23.08-PM.mp4"][/video]

[video width="464" height="832" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/01/WhatsApp-Video-2026-01-30-at-12.22.55-PM.mp4"][/video]

మంత్రి అడ్లూరి కాన్వాయ్‌పై దాడి

ఇక నిన్న రాత్రి చిలుక‌ల గుట్ట నుంచి మేడారం గ‌ద్దెల వ‌ద్ద‌కు స‌మ్మ‌క్క‌ను తీసుకొచ్చారు. స‌మ్మ‌క్క ఆగ‌మ‌నంతో భ‌క్తులు పుల‌కించిపోయారు. స‌మ్మ‌క్క ఆగ‌మానాన్ని చూసేందుకు భ‌క్తులు పోటీ ప‌డ్డారు. అనంత‌రం ద‌ర్శించుకునేందుకు పెద్ద సంఖ్య‌లో గ‌ద్దెల వ‌ద్ద‌కు భ‌క్తులు చేరుకున్నారు. ఇదే స‌మ‌యంలో జంప‌న్న వాగుపై మంత్రి ఆడ్లూరి ల‌క్ష్మ‌ణ్ త‌న కాన్వాయ్‌పై గంట‌కు పైగా ఆపి సైర‌న్ మోగించారు. అదే సమయంలో కరెంటు పోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. సైరన్ శబ్దానికి, మంత్రి అనుచరుల అత్యుత్సాహానికి భక్తులు మండిపడి కాన్వాయ్‌పై దాడి చేశారని అధికారులు చెబుతున్నారు.

https://x.com/i/status/2017060683356024974

Advertisement

తాజావార్తలు

Advertisement