త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POCSO Case | పోక్సో కేసులో కీల‌క ప‌రిణామం.. పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భ‌గీర‌థ్‌

POCSO Case | తెలంగాణ‌లో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారిన పోక్సో కేసులో శ‌నివారం కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. మైన‌ర్ బాలిక‌పై లైంగిక వేధింపులు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బండి భ‌గీర‌థ్ ఎట్ట‌కేల‌కు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట హాజ‌ర‌య్యాడు.

P

Telangana | Published On May 16, 2026, 8.58 pm IST

POCSO Case | పోక్సో కేసులో కీల‌క ప‌రిణామం.. పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భ‌గీర‌థ్‌
Advertisement

POCSO Case | తెలంగాణ‌లో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారిన పోక్సో కేసులో శ‌నివారం కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. మైన‌ర్ బాలిక‌పై లైంగిక వేధింపులు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బండి భ‌గీర‌థ్ ఎట్ట‌కేల‌కు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట హాజ‌ర‌య్యాడు. ఈ కేసులో ముంద‌స్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. గురువారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు హైకోర్టు వెకేష‌న్ బెంచ్ విచార‌ణ జ‌రిపింది. పోలీసులు, భ‌గీర‌థ్ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపించారు. ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న కోర్టు తీర్పును రిజ‌ర్వ్ చేసింది. అరెస్టు చేయ‌కుండా పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేయ‌గా.. ధర్మాస‌నం నిరాక‌రించింది.

ఇప్ప‌టికే ప‌లుసార్లు పోలీసులు విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ నోటీసులు జారీ చేయ‌గా.. హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్ల‌య్యింది. మ‌రో వైపు పోలీసులు దర్యాప్తును వేగ‌వంతం చేసి.. భ‌గీర‌థ్ ఆచూకీ కోసం ప్ర‌త్యేక బృందాల‌ను రంగంలోకి దించారు. నోటీసులు ఇచ్చినా హాజ‌రుకాక‌పోవ‌డంతో పోలీసులు కరీంనగర్‌, హైదరాబాద్‌, ఢిల్లీ ప్రాంతాల్లో గాలించారు. దేశం విడిచి పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్ర‌మంలో న్యాయ‌వాదుల స‌ల‌హా మేర‌కు చివ‌ర‌కు భ‌గీర‌థ్‌ను వారి స‌మ‌క్షంలోనే పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

చ‌ట్టంముందు అంద‌రూ స‌మాన‌మే : బండి సంజ‌య్‌

భ‌గీర‌థ్‌ను న్యాయ‌వాదుల స‌మ‌క్షంలో పోలీసుల ఎదుట హాజ‌రుప‌రిచిన‌ట్లు కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ వివ‌రించారు. తన కుమారుడు భగీరథ్‌ను చట్టపరమైన ప్రక్రియలో భాగంగా పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. అడ్వకేట్ల ద్వారా విచారణకు సహకరించేలా పోలీసుల ఎదుట హాజరుపరిచినట్లు చెప్పారు. “చట్టం ముందు నా కుమారుడైనా, సాధారణ వ్యక్తైనా ఒక్కటే. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాలి” అని బండి సంజయ్ స్పష్టం చేశారు. తన కుమారుడు తాను ఎలాంటి తప్పూ చేయలేదని పదేపదే చెబుతున్నాడన్నారు.

Advertisement
Advertisement