త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddapalli | బిల్లుల క్లియ‌రెన్స్ కోసం రూ. 3 ల‌క్ష‌ల డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఏఈ

Peddapalli | పెద్ద‌ప‌ల్లి ప‌ట్ట‌ణంలో అసిస్టెంట్ ఇంజినీర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. రూ. 2 ల‌క్ష‌లు లంచం తీసుకుంటుండ‌గా ఏఈ స‌తీశ్‌ను ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు.

S

Telangana | Published On Jul 14, 2026, 1.42 pm IST

Peddapalli | బిల్లుల క్లియ‌రెన్స్ కోసం రూ. 3 ల‌క్ష‌ల డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఏఈ
Advertisement

Peddapalli | త్రినేత్ర‌.న్యూస్ : పెద్ద‌ప‌ల్లి ప‌ట్ట‌ణంలో అసిస్టెంట్ ఇంజినీర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. రూ. 2 ల‌క్ష‌లు లంచం తీసుకుంటుండ‌గా ఏఈ స‌తీశ్‌ను ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు.

పెద్ద‌ప‌ల్లి మున్సిపాలిటీ ప‌రిధిలో ఓ కాంట్రాక్ట‌ర్ బిల్లుల క్లియ‌రెన్స్ కోసం ఏఈ స‌తీశ్ రూ. 3 ల‌క్ష‌లు లంచం డిమాండ్ చేశారు. అయితే మంగ‌ళ‌వారం రూ. 2 ల‌క్ష‌లు కాంట్రాక్ట‌ర్ నుంచి ఏఈ లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. అనంత‌రం ఆయ‌న ఆఫీసుతో పాటు ఇంట్లో ఏసీబీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. స‌తీశ్ ఇంట్లో రూ. 32,31,900 న‌గ‌దును సీజ్ చేశారు.

జూలై 9వ తేదీన పంచాయ‌త్ రాజ్ శాఖ‌లో పని చేస్తున్న ఏఈ పైడి స‌తీశ్ కూడా ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయారు. గంగాధ‌ర మండ‌ల కేంద్రంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటుండ‌గా అధికారులు ఆయ‌న‌ను ప‌ట్టుకున్నారు. ఉపాధి హామీ ప‌థ‌కం రికార్డుల‌ను ప‌రిశీలించి ఆమోదించేందుకు ఏఈ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేసిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది.

Advertisement
Advertisement