త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kodandaram | ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన‌వ‌స‌ర వివాదాల‌కు తెర‌లేపుతున్న‌రు: కోదండ‌రాం

Kodandaram | జ‌న‌సేన అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అన‌వ‌స‌ర వివాదాల‌కు తెర లేపుతున్నార‌ని ఎమ్మెల్సీ కోదండ‌రాం మండిప‌డ్డారు. వ్య‌క్తుల మ‌ధ్య విభేదాల‌ను ప్రాంతాల మ‌ధ్య వైరుధ్యంగా మార్చుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Jun 2, 2026, 11.57 am IST

Kodandaram | ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన‌వ‌స‌ర వివాదాల‌కు తెర‌లేపుతున్న‌రు: కోదండ‌రాం
Advertisement

Kodandaram | త్రినేత్ర‌.న్యూస్‌: జ‌న‌సేన అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అన‌వ‌స‌ర వివాదాల‌కు తెర లేపుతున్నార‌ని ఎమ్మెల్సీ కోదండ‌రాం మండిప‌డ్డారు. వ్య‌క్తుల మ‌ధ్య విభేదాల‌ను ప్రాంతాల మ‌ధ్య వైరుధ్యంగా మార్చుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈమేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం మాట్లాడారు.

ప్రొఫెసర్ నాగేశ్వరరావు వాఖ్యలు నచ్చకపోతే అభ్యంతరం తెల‌ప‌డానికి చాలా మార్గాలు ఉన్నాయి. పోలీసు కేసుల దాకా ఎందుకు? మొదటి నుండి తెలంగాణ అంటే బీజేపీకి గిట్టదు. బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ ద్వారా ఇదంతా నడిపిస్తుంది. ఇంత రాద్దాంతం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చే మాట్లాడాలా.. ఏపీలో మాట్లాడొచ్చు కదా? అని కోదండ‌రాం ప్ర‌శ్నించారు. రైతు డిస్కం వల్ల రైతులకు లాభం జరిగితే మంచిది.. అయితే డిస్కం లక్ష్యాలు ప్రభుత్వం చెప్పాలి అని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement