త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gudem Mahipal Reddy | మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాలి : ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి

Gudem Mahipal Reddy | మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్‌రెడ్డి కోరారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు.

P

Telangana | Published On Feb 9, 2026, 6.16 pm IST

Gudem Mahipal Reddy | మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాలి : ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి
Advertisement

Gudem Mahipal Reddy | తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన కొంద‌రు ఎమ్మెల్యేలు అనంత‌రం కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. అయితే, అధికార పార్టీలో, ప్ర‌భుత్వం నుంచి పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్క‌క‌పోవ‌డంతో కొంద‌రు నేత‌లు త‌మ అసంతృప్తిని బాహాటంగానే వ్య‌క్తం చేస్తున్నారు. ఇందులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి కూడా ఉన్నారు.

గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ మళ్లీ సొంత గూటి వైపు వెళ్లేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో ఆయన సోదరుడు భేటీ కావడం ఈ వార్త‌ల‌కు బలం చేకూర్చింది. దీంతో గూడెం మహిపాల్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో ఆయన మరోసారి వార్తల‌కెక్కారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయన బహిరంగంగా బీఆర్ఎస్‌కు అనుకూలంగా పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లో చేరాల‌ని తీసుకున్న నిర్ణ‌యం త‌ప్పేన‌ని ఆయ‌న గ‌తంలో ఓ వేదిక‌పై వ్యాఖ్యానించారు. అయితే, ప్ర‌భుత్వంలో ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వస్తాయన్న ఉద్దేశంతోనే అధికార పార్టీలో చేరినట్లు ఆయన సన్నిహిత పేర్కొంటున్నారు. అయితే, ఆ తర్వాత ప్రభుత్వ నుంచి ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్‌లో చేరేందుకు యోచిస్తున్నారని సమాచారం.

గతంలోనే గులాబీ పార్టీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, అప్పట్లో బీఆర్ఎస్ అధిష్టానం సానుకూలంగా స్పందించలేదన్న ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఆయన సోదరుడు కేసీఆర్‌తో సమావేశమవడం, అలాగే బీఆర్ఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేయడం నేపథ్యంలో ఈసారి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఆయన అధికారికంగా బీఆర్ఎస్‌లో చేరే అవకాశముందని సమాచారం.

Advertisement
Advertisement