త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murder | ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేద‌ని.. త‌ల్లిదండ్రుల‌ను చంపిన కూతురు

Murder | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని ఓ కూతురు త‌న‌ తల్లిదండ్రులను హత్య చేసింది.

S

Telangana | Published On Jan 28, 2026, 4.47 pm IST

Murder | ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేద‌ని.. త‌ల్లిదండ్రుల‌ను చంపిన కూతురు
Advertisement

Murder | త్రినేత్ర‌.న్యూస్ : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని ఓ కూతురు త‌న‌ తల్లిదండ్రులను హత్య చేసింది. ఈ ఘ‌ట‌న వికారాబాద్ జిల్లా బంట్వారం మండ‌లం యాచారం గ్రామంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. యాచారం గ్రామానికి చెందిన న‌క్క సురేఖ న‌ర్సింగ్ హోంలో న‌ర్సుగా విధులు నిర్వ‌హిస్తుంది. అయితే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. పెళ్లి చూడా చేసుకోవాల‌నుకున్నారు. కానీ వీరి కులాలు వేరు కావ‌డంతో.. పెళ్లికి యువ‌తి త‌ల్లిదండ్రులు అంగీక‌రించ‌లేదు.

త‌న ప్రేమ పెళ్లికి అడ్డు ప‌డుతున్న త‌ల్లిదండ్రుల‌ను తొల‌గించుకోవాల‌ని ఆ యువ‌తి కుట్ర ప‌న్నింది. కుట్ర‌లో భాగంగా.. తాను పనిచేస్తున్న నర్సింగ్ హోం నుండి అనస్థీషియా తెచ్చి, ఒళ్లు నొప్పులకు మందు అని చెప్పి, ఎక్కువ డోసేజ్ కలిగిన ఇంజెక్షన్లు తల్లిదండ్రులకు యువతి ఇచ్చింది. దాంతో త‌ల్లిదండ్రులిద్ద‌రూ ప్రాణాలు కోల్పోయారు. ఆ త‌ర్వాత త‌ల్లిదండ్రులు చ‌నిపోయార‌ని చెప్పి సోద‌రుడికి స‌మాచారం అందించింది.

యువ‌తి ప్ర‌వ‌ర్త‌న‌పై కుటుంబ స‌భ్యుల‌కు, బంధువుల‌కు అనుమానం వ‌చ్చింది. దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టగా, తానే హ‌త్య చేసిన‌ట్లు అంగీక‌రించింది యువ‌తి. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా చ‌ర్చానీయాంశ‌మైంది.

Advertisement

తాజావార్తలు

Advertisement