త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Santosh Kumar | లండ‌న్‌లో మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు ఘ‌న‌స్వాగ‌తం

Santosh Kumar | లండ‌న్‌లో మాజీ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌కు ఎన్నారై బీఆర్ఎస్ యూకే స‌భ్యులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.

S

Telangana | Published On Apr 15, 2026, 6.32 pm IST

Santosh Kumar | లండ‌న్‌లో మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు ఘ‌న‌స్వాగ‌తం
Advertisement

Santosh Kumar | త్రినేత్ర‌.న్యూస్ : లండ‌న్‌లో మాజీ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌కు ఎన్నారై బీఆర్ఎస్ యూకే స‌భ్యులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఇగ్నైటెడ్ మైండ్స్ నిర్వాహకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని అందుకోవడానికి లండన్ వెళ్లిన‌ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం, అధ్యక్షులు నవీన్ రెడ్డి, గ్రీన్ ఇండియా కో ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాబుపేట్, సత్యమూర్తి చిలుముల, మాజీ అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, కార్యదర్శి - ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు, యూత్ వింగ్ సెక్రటరీలు పవన్ కుమార్ గౌడ్, తరుణ్ లునావత్, యూత్ వింగ్ కో ఆర్డినేటర్ అమరేశ్వరి బోయిని, మీడియా కో ఆర్డినేటర్ సాయి కిరణ్ రావు పేరాల, లెస్టర్ ఇంచార్జ్ సాకేత్ కాచవరపు, టాక్ జనరల్ సెక్రటరీ సుప్రజ పులుసు, ముఖ్య సభ్యులు సుమంత్, సంకీర్త్ రెడ్డి, శివ చరణ్ పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement