త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ప‌ళ్లు ఇకిలించుకుంటూ సెల్ఫీలు.. కేటీఆర్‌పై రేవంత్ విమ‌ర్శ‌లు

KTR | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. రైతుల‌కు సాయం చేయాల్సింది పోయి ప‌ళ్లు ఇకిలించుకుంటూ సెల్ఫీలు దిగుతున్నారు అని సీఎం విమ‌ర్శించారు.

S

Telangana | Published On May 21, 2026, 4.18 pm IST

KTR | ప‌ళ్లు ఇకిలించుకుంటూ సెల్ఫీలు.. కేటీఆర్‌పై రేవంత్ విమ‌ర్శ‌లు
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. రైతుల‌కు సాయం చేయాల్సింది పోయి ప‌ళ్లు ఇకిలించుకుంటూ సెల్ఫీలు దిగుతున్నారు అని సీఎం విమ‌ర్శించారు. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు సీఎం స‌మాధానం ఇచ్చారు.

వ‌రి ధాన్యం కొనుగోళ్ల‌పై సీఎంను ప్ర‌శ్నించ‌గా.. 20 శాతం ధాన్యం మాత్ర‌మే ఇంకా పెండింగ్‌లో ఉంది.. ఆ 20 శాతం కూడా పూర్తిగా సేక‌రిస్తాం. వ‌రి వేసుకుంటే ఉరేసుకోవాల‌న్న ఆయ‌న సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే మీరు చూపిస్తున్నారు. వ‌డ‌గ‌ళ్ల వాన పంట న‌ష్టం జ‌రిగితే రైతుల‌కు సాయం చేయాల్సింది పోయి అక్క‌డ సెల్ఫీలు దిగుతున్నారు. రైతు చ‌నిపోతే కూడా వారికి స‌హాయం చేయాల్సింది పోయి ప‌ళ్లు ఇకిలించుకుంటూ ఫొటోలు దిగుతున్నారు. రైతు చ‌నిపోయిన విష‌యం అందరికి తెలిసిందే క‌దా.. మీ దొంగ సొమ్ము కొంచెమైనా ఆ రైతు కుటుంబాల‌కు ఇవ్వొచ్చు క‌దా అని అన్నారు.

కేటీఆర్‌కు మాన‌వ‌త్వం లేదు. మ‌నిషికి ఉండాల్సిన విలువ లేదు. మ‌న‌షుల‌ల్లాగా బీఆర్ఎస్ వాళ్లు బీహేవ్‌ చేయ‌లేదు. వ‌రి ధాన్యం కొనుగోళ్లు చేసిన త‌ర్వాత డ‌బ్బుల‌ను రైతుల ఖాతాలో జ‌మ చేసేందుకు గ‌తంలో 6 నెల‌లు ప‌ట్టేది.. మేం 72 గంట‌ల్లో రైతుల ఖాతాల్లో డ‌బ్బులు వేస్తున్నాం. హ‌మాలీలు లేనందు వ‌ల్ల గ్యాప్ వ‌చ్చింది. రైతుకు కొంచెం న‌ష్టం వ‌చ్చింది.. ఈ విష‌యంలో మాకు దుఃఖం ఉంది.. వీలైనంత వ‌ర‌కు క‌లెక్ట‌ర్లు మంత్రుల‌ను పంపించి ప్ర‌య‌త్నం చేస్తున్నాం. మీకు కూడా ఏదైనా సూచ‌న చేయండి.. శ‌వ రాజ‌కీయాలు వ‌ద్దు కొంచెమ‌న్న సిగ్గుప‌డండి.. వ‌రి వేసుకుంటే ఉరేసుకున్న‌ట్టే అన్నోళ్లు రాజ‌కీయాలు చేస్తున్నారు అని కేటీఆర్ మండిప‌డ్డారు.

Advertisement
Advertisement