త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prashanth Reddy | సింగ‌రేణి కాంట్రాక్ట్ బ‌య‌ట‌పెట్టినందుకే నోటీసులు:  మాజీ మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి

Prashanth Reddy | సింగ‌రేణి (Singareni) బొగ్గు గ‌నుల కాంట్రాక్ట్ బ‌య‌ట‌పెట్టినందుకే హ‌రీశ్‌రావు (Harish Rao)కు సిట్ (CIT) నోటీసులు జారీ చేసింద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్ర‌శాంత్‌రెడ్డి (Prashanth Reddy) ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మంత్రులు రెండేళ్ల నుంచి కుంభ‌కోణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌పెడుతూనే ఉన్నామ‌ని గుర్తు చేశారు. 

A

Telangana | Published On Jan 20, 2026, 4.08 pm IST

Prashanth Reddy | సింగ‌రేణి కాంట్రాక్ట్ బ‌య‌ట‌పెట్టినందుకే నోటీసులు:  మాజీ మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి
Advertisement
Prashanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌ : సింగ‌రేణి (Singareni) బొగ్గు గ‌నుల కాంట్రాక్ట్ బ‌య‌ట‌పెట్టినందుకే హ‌రీశ్‌రావు (Harish Rao)కు సిట్ (CIT) నోటీసులు జారీ చేసింద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్ర‌శాంత్‌రెడ్డి (Prashanth Reddy) ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మంత్రులు రెండేళ్ల నుంచి కుంభ‌కోణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. రెండేళ్ల నుంచి మంత్ర‌లు కుంభ‌కోణాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌పెడుతూనే ఉన్నామ‌ని గుర్తు చేశారు. కుంభ‌కోణాల‌ను శాస‌న‌స‌భ వేదిక‌గా ప్ర‌జాక్షేత్రంగా బ‌య‌ట‌పెడుతుంటే త‌మ‌కు కేసులు పెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ప్ర‌శాంత్‌రెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఒకసారి కాళేశ్వ‌రం కేసు అని, మ‌రోసారి ఈ కార్ రేసు కేస‌ని, మ‌రోసారి విద్యుత్ కేస‌ని విచార‌ణ పేరుతో పిలుస్తున్నార‌ని చెప్పారు. ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమ‌లును నిలదీస్తూనే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.
రాష్ట్రంలో దండుపాళెం ముఠా ప్రభుత్వాన్ని నడిపిస్తుందని దుయ్య‌బ‌ట్టారు. ఆ బ్యాచ్‌కు నాయ‌కుడు ముఖ్య‌మంత్రి అని, మంత్రులంతా స‌భ్యుల‌ని ఎద్దేవా చేశారు. సివిల్ స‌ప్లై విభాగంలో పెద్ద ఎత్త‌న అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. స‌మ్మ‌క్క‌, సార‌క్క టెండర్ల విష‌యంలో మంత్రుల మ‌ధ్య కొట్లాట జ‌రిగింద‌న్నారు. పారిశ్రామిక భూముల‌ను రేవంత్‌రెడ్డి త‌న బంధువులకు అప్ప‌గిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. హ్యామ్ రోడ్ల పేరుతో కుంభకోణం జరగబోతుంద‌ని అన్నారు. రూ.1600 కోట్ల విలువైన బొగ్గు గనుల కాంటాక్ట్ విషయంలోనే ముఖ్యమంత్రి , మంత్రులకు మధ్య గొడవ జ‌రిగింద‌ని చెప్పారు. రోజుకొక కుంభకోణాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమ‌ర్శించారు. ఈ కుంభ‌కోణాల‌పై సిట్ ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు.
టీవీ సీరియల్ మాదిరిగా రోజుకో కేసు పేరుతో డ్రామా నడిపిస్తున్నారని మండిప‌డ్డారు. తాము ప్ర‌శ్నిస్తుంటే త‌మ‌పై కేసులు పెడుతున్నార‌ని వాపోయారు. ఎంత డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేసినా రేవంత్‌రెడ్డి అవినీతిని బ‌య‌ట‌పెడుతూనే ఉంటామ‌ని ప్ర‌క‌టిఆంచారు. ప్ర‌జ‌ల కోసం జైలుకు వెళ్లిన వ్య‌క్తి హ‌రీశ్‌రావు అని గుర్తు చేశారు. తామంతా కేసీఆర్ సైనికుల‌మ‌ని, ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌బోమ‌ని అన్నారు. హ‌రీశ్‌రావు వెంట యావ‌త్ తెలంగాణ స‌మాజం ఉంద‌ని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన‌ప్ప‌టికీ కావాల‌నే హ‌రీశ్‌రావు హరీష్ రావుపై కావాలని నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.
Advertisement

తాజావార్తలు

Advertisement