త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nori Dattatreyudu Meets CM Revanth Reddy | రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు

గతంలో రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ, చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించి, అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తన సలహాలు, సహకారం అందిస్తానని దత్తాత్రేయుడు హామీ ఇచ్చారు.

J

Telangana | Published On Feb 2, 2026, 8.36 pm IST

Nori Dattatreyudu Meets CM Revanth Reddy | రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
Advertisement

Nori Dattatreyudu Meets CM Revanth Reddy | ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సీఎంకి హామీ ఇచ్చారు.

వైద్య రంగంలో విశేష సేవలకు గాను డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'పద్మ భూషణ్' పురస్కారం ప్రకటించింది.ఈనేపథ్యంలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడుతో పాటు, పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రముఖులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

గతంలో రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ, చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించి, అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తన సలహాలు, సహకారం అందిస్తానని దత్తాత్రేయుడు హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement