త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NIMS | నిమ్స్‌లో క్యాన్స‌ర్ రోగుల‌కు ఉచితంగా సీక్వెన్సింగ్ జ‌న్యు ప‌రీక్ష‌లు

NIMS | ప్రాణాంత‌క క్యాన్స‌ర్ (Cancer) మ‌హ‌మ్మారి రాష్ట్రంలో విజృంభిస్తున్న‌ది. దీని బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న‌ది. వ్యాధి చికిత్స‌కు కూడా ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు అవుతుండ‌టంతో పేద‌లు వేద్యానికి వెనక‌డుగు వేస్తున్నారు.

G

Telangana | Published On May 29, 2026, 6.44 am IST

NIMS | నిమ్స్‌లో క్యాన్స‌ర్ రోగుల‌కు ఉచితంగా సీక్వెన్సింగ్ జ‌న్యు ప‌రీక్ష‌లు
Advertisement

NIMS | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రాణాంత‌క క్యాన్స‌ర్ (Cancer) మ‌హ‌మ్మారి రాష్ట్రంలో విజృంభిస్తున్న‌ది. దీని బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న‌ది. వ్యాధి చికిత్స‌కు కూడా ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు అవుతుండ‌టంతో పేద‌లు వేద్యానికి వెనుక‌డుగు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో క్యాన్స‌ర్ రోగుల‌కు నిమ్స్ (NIMS) ద‌వాఖాన గుడ్‌న్యూస్ అందించింది. అత్యాధునిక నెక్స్ట్ జ‌న‌రేష‌న్ సీక్వెన్సింగ్‌ జన్యు పరీక్షలను (Next Generation Sequencing Genetic tests) అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రైవేటులో రూ.80 వేల వరకు అయ్యే ఈ పరీక్షను ఆరోగ్యశ్రీ (Aarogyasri)కింద పేదలకు ఉచితంగా చేయ‌నుంది. త‌ద్వారా క్యాన్సర్‌కు కారణమైన జన్యువును గుర్తించి టార్గెటెడ్ థెరపీ అందించనున్నారు.

మ‌హిళ‌లే అధికం..

రాష్ట్రంలో క్యాన్సర్ బారినప‌డుతున్న వారిలో మహిళ‌లే అధికంగా ఉంటున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్​కేర్ ట్రస్ట్ ద్వారా ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబర్ 2025 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌‌లో సేకరించిన వివరాల ఆధారంగా ప్రభుత్వం ఒక నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఈ ఐదున్నరేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా లక్షా 294 మంది క్యాన్సర్ బారిన పడగా, అందులో ఏకంగా 60 శాతం మంది మహిళలే ఉన్నారు. అంటే సుమారు 60 వేల మంది ఆడబిడ్డలు ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారు. గతంలో ఈ వ్యాధి కేవలం వృద్ధులకే పరిమితమని అనుకునేవారు. కానీ ఈ రిపోర్టు ప్రకారం 33 ఏండ్ల వయస్సు నుంచే మహిళలపై ఎక్కువగా క్యాన్సర్ మ‌హ‌మ్మారి పంజా విసురుతున్నది.

ప్రతి లక్ష మంది జనాభాలో సగటున 62 మంది మహిళలు మహమ్మారి బారిన పడుతుండగా, పురుషుల్లో ఆ సంఖ్య 42కు పరిమితమైంది. మహిళల ప్రాణాలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార, అండాశయ క్యాన్సర్లు యమపాశాల్లా మారాయి.

ఆరోగ్య శ్రీ లెక్కల ప్రకారం..

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు 15,502 కాగా, గర్భాశయ క్యాన్సర్ కేసులు 11,834గా నమోదయ్యాయి. అండాశయ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ కేసులు 5,700గా రికార్డయ్యాయి. ఈ మూడు రకాల క్యాన్సర్లే మహిళా బాధితుల్లో సింహభాగం ఉంటున్నాయి. వీరికి పాలియేటివ్ కేర్, కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సల అవసరం ఎక్కువగా ఉంటోంది. ఏడాదికి సగటున 18,235 కేసులు నమోదవుతుండగా, అందులో సుమారు 11 వేల కేసులు మహిళలవే ఉంటున్నాయి.

Advertisement
Advertisement