REDMOD | వైద్య నిపుణులకు సైతం సాధ్యం కాలేదు.. క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తున్న ఏఐ..
REDMOD | అమెరికా శాస్త్రవేత్తలు పాంక్రియాటిక్ (క్లోమగ్రంథి) క్యాన్సర్ అధికారిక నిర్ధారణకు మూడు సంవత్సరాల ముందే గుర్తించే సామర్థ్యం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. చికిత్సకు అత్యంత క్లిష్టమైన క్యాన్సర్లలో ఒకటైన ఈ వ్యాధిపై ఇది కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
REDMOD | అమెరికా శాస్త్రవేత్తలు పాంక్రియాటిక్ (క్లోమగ్రంథి) క్యాన్సర్ అధికారిక నిర్ధారణకు మూడు సంవత్సరాల ముందే గుర్తించే సామర్థ్యం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. చికిత్సకు అత్యంత క్లిష్టమైన క్యాన్సర్లలో ఒకటైన ఈ వ్యాధిపై ఇది కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. రెడ్మాడ్ (REDMOD) అనే ఈ టూల్ను మాయో క్లినిక్ (Mayo Clinic), యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎండీ ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు కలిసి రూపొందించారు. ఇది సీటీ స్కాన్లను విశ్లేషించి, మానవ కంటికి కనిపించని టిష్యూ నిర్మాణం, టెక్స్చర్లోని సూక్ష్మ మార్పులను గుర్తిస్తుంది. దీంతో వైద్యులు అధికారికంగా క్లోమగ్రంథి క్యాన్సర్ ఉందని నిర్దారించడానికి 3 ఏళ్ల ముందే ఈ ఏఐ వ్యవస్థ ఈ క్యాన్సర్ను గుర్తిస్తుందని వెల్లడైంది. సాధారణంగా ఇలాంటి సూక్ష్మ పరిమాణంలో ఉండే మార్పులను గుర్తించడం, దాన్ని క్యాన్సర్గా నిర్దారించడం ఎంతటి నిపుణులైన డాక్టర్లకైనా ముందస్తుగా సాధ్యం కాదు. కానీ దాన్ని ఏఐ చేసి చూపించింది.
వైద్య నిపుణుల కన్నా ముందే నిర్దారిస్తున్న ఏఐ..
పరీక్షల్లో రెడ్మాడ్ అత్యంత సాధారణమైన పాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలను దాదాపు నాలుగింట మూడు వంతుల కేసుల్లో సరిగ్గా గుర్తించింది. అంతేకాదు, రోగులకు అధికారికంగా క్యాన్సర్ నిర్ధారణకు సగటున 16 నెలల ముందుగానే ఈ లక్షణాలను గుర్తించింది. ఇదే స్కాన్లను ఏఐ సహాయం లేకుండా పరిశీలించిన వైద్య నిపుణులతో పోలిస్తే ఇది దాదాపు రెండింతలు ఎక్కువ గుర్తింపు రేటు కావడం విశేషం. కొన్ని సందర్భాల్లో ఈ వ్యవస్థ రెండు సంవత్సరాలకంటే ముందే అనుమానాస్పద లక్షణాలను నిర్దారించింది. ఈ ఏఐ వ్యవస్థను 969 సీటీ స్కాన్ల ఆధారంగా ట్రెయిన్ చేసి, తరువాత వేరే డేటాతో పరీక్షించారు. ఇందులో క్యాన్సర్ తర్వాత అభివృద్ధి చెందిన 63 మంది రోగుల స్కాన్లు కూడా ఉన్నాయి. వీరిని ముందుగా రేడియాలజిస్టులు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పినా, రెడ్మాడ్ వాటిలో 46 కేసులను అనుమానాస్పదంగా గుర్తించింది. అయితే, 430 మంది ఆరోగ్యవంతులలో 81 మందిని తప్పుగా అనుమానితులుగా గుర్తించింది. దీంతో వారికి అదనపు పరీక్షలు అవసరం అయ్యే అవకాశాలు ఉంటాయి.
ముందుగా గుర్తిస్తే చికిత్సకు అవకాశం..
మాయో క్లినిక్ రేడియాలజిస్టు అజిత్ గోయెంకా మాట్లాడుతూ ఈ వ్యవస్థ సాధారణంగా కనిపించే పాంక్రియాస్లో కూడా క్యాన్సర్ సిగ్నేచర్ను గుర్తించగలదని తెలిపారు. పాంక్రియాటిక్ క్యాన్సర్ 2030 నాటికి అమెరికాలో క్యాన్సర్ మరణాలకు రెండవ ప్రధాన కారణంగా మారే అవకాశం ఉందని గణాంకాల్లో తేలింది.అయితే 85 శాతం వరకు కేసులను వ్యాధి బాగా ముదిరిన తరువాతే గుర్తించగలుగుతున్నారు. కానీ ముందుగానే గుర్తిస్తే రోగులకు పూర్తిగా నయం చేసే చికిత్సలను అందించే అవకాశాలు ఉంటాయి. ఈ టెక్నాలజీని సాధారణ వైద్య విధానాల్లో ఉపయోగించే ముందు, మరింత విస్తృతంగా, వివిధ ప్రజా విభాగాల్లో పరీక్షలు చేయడం అవసరమని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాగా ఈ అధ్యయనాన్ని గట్ (Gut) అనే జర్నల్లోనూ ప్రచురించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






