Jagadish Reddy BRS | ఏపీకి మన నీళ్లు అమ్ముకుంటున్నరు
ఏపీ అక్రమంగా కృష్ణా జలాలను తరలిస్తున్నా రేవంత్ సర్కార్ ఎందుకు మౌనంగా ఉంది? రాజకీయాల కోసం రైతుల పొట్టగొడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
సంక్షిప్త సారాంశం
పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ అక్రమంగా కృష్ణా జలాలను తరలిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉండాల్సిన 150 టీఎంసీల నీళ్లు ఇప్పుడు ఏపీ ప్రాజెక్టుల్లో ఉన్నాయని ఆయన విమర్శించారు. ఢిల్లీ లాబీయింగ్, రాజకీయ అవసరాల కోసమే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల దోపిడీని నిరసిస్తూ కేటీఆర్ నేతృత్వంలో సెప్టెంబర్ 3న మిర్యాలగూడలో భారీ 'రైతు మహాధర్నా' నిర్వహించనున్నారు.
- రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్
Jagadish Reddy BRS | త్రినేత్ర.న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను (Krishna waters) తరలించుకుపోతున్నా.. తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు మౌనంగా ఉంటోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ లాబీయింగ్ (Delhi lobbying) కోసం నల్గొండ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాకట్టు పెడుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి ఏపీ ప్రభుత్వం రోజూ 40 క్యూసెక్కుల నీటిని తరలిస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం అభ్యంతరం కూడా తెలపకపోవడం దారుణమన్నారు. "శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో ఉండాల్సిన నీళ్లలో దాదాపు 150 టీఎంసీల (150 TMC) నీళ్లు ఏపీ ప్రాజెక్టుల్లో దర్శనమిస్తున్నాయి. మన ఇంట్లో ఉండాల్సిన వస్తువు పక్కనోడి ఇంట్లో ఉందంటే.. వాళ్లు తీసుకుపోతున్నారనడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం ఏం కావాలి?" అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. అభ్యంతరం చెప్పకపోవడం అంటే.. పరోక్షంగా అనుమతి ఇచ్చినట్లేనని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఏపీకి నీళ్లు అమ్ముకుంటోందని జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను, ప్రాజెక్టులను కాపాడాల్సిన రేవంత్, ఉత్తమ్లే లంచాలు తీసుకుని నీళ్లు తరలించుకుపోవడానికి సహకరిస్తున్నారని మండిపడ్డారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత రాష్ట్ర రైతులను నిలువునా ముంచుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రైతుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ తమ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. నీటి దోపిడీని అడ్డుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలో సెప్టెంబర్ 3న మిర్యాలగూడలో భారీ ఎత్తున 'రైతు మహాధర్నా' నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు.
🚨 ఏపీ అక్రమ నీటి తరలింపుపై రేవంత్ సర్కార్ మౌనం ఎందుకు?
ఢిల్లీ లాబీయింగ్ కోసం తెలంగాణ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడతారా? 😡
కృష్ణా జలాల తరలింపును అడ్డుకోకుండా నల్గొండ ఆయకట్టుకు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్రోహం చేస్తున్నారు.
🌾 రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ వర్కింగ్… pic.twitter.com/x4sed1aLwe
— BRS Party (@BRSparty) August 31, 2026
ఆంధ్రప్రదేశ్ నీళ్లు అక్రమంగా తీసుకుపోతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అభ్యంతరం తెలపడం లేదు
దానికి అభ్యంతరం చెప్పకపోవడం అంటే అనుమతి ఇచ్చినట్లే
పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి రోజుకి 40 క్యూసెక్కుల నీళ్లు ఏపీకి తీసుకుపోతున్నారు
శ్రీశైలం - నాగార్జున సాగర్లో ఉన్న నిల్వ నీళ్లలో… pic.twitter.com/mCtKBabIkv
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Balmoor Venkat | బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
సెప్టెంబర్ 10, 2026

BRS | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తన.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం!
సెప్టెంబర్ 10, 2026

Legislative Council Session | పాటలు పాడుతూ.. శాసన మండలిలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఆందోళన
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ
- ●Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?
- ●Komatireddy Rajagopal Reddy | ఖర్చెక్కువవుతుంది.. ఇందిరమ్మ ఇళ్లకిచ్చే నిధులు పెంచాలి

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి

Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ



