త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Richest People | హైద‌రాబాద్‌లో అత్యంత ధ‌న‌వంతులు.. మేఘా అధినేత ఏ స్థానంలో ఉన్నారంటే?

Richest People | దేశంలో ఫార్మా క్యాపిట‌ల్‌గా పేరొందిన‌ హైదరాబాద్ (Hyderabad).. సాఫ్ట్‌వేర్‌, ఇన్‌ఫ్రా, రియ‌ల్ఎస్టేట్ ఇలా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న‌ది. దీంతో న‌గ‌రంలో సంప‌న్నులు (Richest People) కూడా రోజురోజుకు రెట్టింప‌వుతున్నారు.

G

Telangana | Published On Jan 16, 2026, 8.37 am IST

Richest People | హైద‌రాబాద్‌లో అత్యంత ధ‌న‌వంతులు.. మేఘా అధినేత ఏ స్థానంలో ఉన్నారంటే?
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో ఫార్మా క్యాపిట‌ల్‌గా పేరొందిన‌ హైదరాబాద్ (Hyderabad).. సాఫ్ట్‌వేర్‌, ఇన్‌ఫ్రా, రియ‌ల్ఎస్టేట్ ఇలా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న‌ది. దీంతో న‌గ‌రంలో సంప‌న్నులు (Richest People) కూడా రోజురోజుకు రెట్టింప‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో అత్యంత ధ‌న‌వంతుల జాబితా తాజాగా విడుదలైంది.

ఇందులో ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్‌ అధినేత మురళి దివి కుటుంబం టాప్ ప్లేస్‌లో ఉన్న‌ది. సుమారు రూ.91,100 కోట్ల నెట్ వర్త్‌తో హైదరాబాద్‌లోనే అత్యంత సంప‌న్నులుగా నిలిచారు. ఇక భారీ ప్రాజెక్టుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL)కు చెందిన పిచ్చి రెడ్డి రూ.42,650 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

  • మూడో స్థానంలో .. రూ.41,810 కోట్ల సంప‌ద‌తో ఎంఈఐఎల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు పీవీ. కృష్ణ రెడ్డి
  • ఫోర్త్ ప్లేస్‌లో.. రూ.39,030 కోట్ల‌తో హెటెరో ల్యాబ్స్‌కు చెందిన బి. పార్థసారధి రెడ్డి
  • ఐదో స్థానంలో.. రూ.39,000 కోట్లతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన కే. సతీష్ రెడ్డి కుటుంబం
    6వ స్థానంలో.. రూ.35,000 కోట్లతో ఆరోబిందో ఫార్మాకు చెందిన పీవీ. రామ్‌ప్రసాద్ రెడ్డి
  • ఏడో స్థానంలో.. రూ.29 వేల కోట్ల‌తో ప్రీమియర్ ఎనర్జీస్‌కు చెందిన సురేందర్ సలూజా కుటుంబం
  • 8వ స్థానంలో.. రూ.25 వేల కోట్ల‌తో మైహోమ్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ఉన్నారు.
  • తొమ్మిదో ప్లేస్‌లో.. రూ.15,900 కోట్ల‌తో బయాలజికల్-ఈ సంస్థకు చెందిన మహిమ దాట్ల‌
  • 10వ స్థానంలో.. ఎమ‌ర్జింగ్ వెల్త్ క్రియేట‌ర్స్ సంస్థ

కాగా, హైదరాబాద్‌లోని ధనికుల జాబితా చూస్తే.. ఎక్కువగా ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, సోలార్ ఎనర్జీ రంగాలకు చెందిన‌వారే ఉన్నారు. అదేవిధంగా న‌గ‌రంలో రూ.1,000 కోట్లు పైగా ఆస్తులు కలిగిన వారు 100 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తున్న‌ది. దీంతో దేశంలో ముంబై, ఢిల్లీ తర్వాత హైద‌రాబాద్‌ మూడో స్థానంలో నిలవడం గ‌మ‌నార్హం.

Advertisement

తాజావార్తలు

Advertisement