త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | న‌ర‌న‌ర‌నా నేను హిందువును.. బీజేపీ ఎమ్మెల్యేల‌కు మంత్రి వాకిటి కౌంట‌ర్

Vakiti Srihari | నేను గుడికి పోయి బొట్టు పెట్టి దేవుడికి మొక్క‌నిది నీళ్లు తాగ‌ను.. నాకూ దేవుడు ఉన్నాడు.. న‌ర‌న‌ర‌నా నేను హిందువును అని మంత్రి వాకిటి శ్రీహ‌రి పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యేల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. ఓట్ల కోసం స‌బ్జెక్టును డైవ‌ర్ట్ చేయొద్దు అని హెచ్చ‌రించారు. గాంధీని గాడ్సేను చంపారు.. దీన్ని స‌మ‌ర్థిస్తారా..? లేదా..? అని సూటిగా అడిగారు.

S

Telangana | Published On Mar 24, 2026, 4.45 pm IST

Vakiti Srihari | న‌ర‌న‌ర‌నా నేను హిందువును.. బీజేపీ ఎమ్మెల్యేల‌కు మంత్రి వాకిటి కౌంట‌ర్
Advertisement

Vakiti Srihari | త్రినేత్ర‌.న్యూస్ : నేను గుడికి పోయి బొట్టు పెట్టి దేవుడికి మొక్క‌నిది నీళ్లు తాగ‌ను.. నాకూ దేవుడు ఉన్నాడు.. న‌ర‌న‌ర‌నా నేను హిందువును అని మంత్రి వాకిటి శ్రీహ‌రి పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యేల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. ఓట్ల కోసం స‌బ్జెక్టును డైవ‌ర్ట్ చేయొద్దు అని హెచ్చ‌రించారు. గాంధీని గాడ్సేను చంపారు.. దీన్ని స‌మ‌ర్థిస్తారా..? లేదా..? అని సూటిగా అడిగారు.

శాస‌న‌సభ‌లో మంత్రి వాకిటి శ్రీహ‌రి మాట్లాడుతూ.. నేను కూడా హిందువున్నే.. ప్రతిరోజు బొట్టుపెట్టుకొని దేవున్ని మొక్కుతా. ప్రపంచ దేశాలు మోకరిల్లి మహాత్మాగాంధీకి దండం పెడుతున్నాయి. అంతటి గొప్పవ్యక్తి గాంధీజీని చంపిన గాడ్సేను పొగిడితే ఏట్లా? గాడ్సేను బీజేపీ నేతలు పొగిడిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. గాంధీజీని గాడ్సే చంపడం తప్పని చెప్పే ధైర్యం ఉందా? అని వాకిటి శ్రీహ‌రి నిల‌దీశారు.

భారతదేశంలో ఎవరి మతం వాళ్లకు ఉంటుంది. మతాలను అన్వయించుకోవడం కాదు.. ఆచరణ రూపం ఉండాలి. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించనవారు సర్ధార్‌ వల్లభాయి పటేల్. అలాంటి వల్లహభాయి పటేల్‌ గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరం. మన ధర్మాలను కాపాడుకుంటూ..ఇతర ధర్మాలను గౌరవించుకోవాలి. హిందువుగానే పుట్టిన.. హిందువుగానే మరణిస్తాను. శ్లోకం, మత ప్రబోధాలను అనర్గళంగా మాట్లాడగలను.. ఏ విష‌యంపైనా అయినా రెండు గంట‌లు మాట్లాడే శ‌క్తి ఉంద‌ని మంత్రి వాకిటి స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement