త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | అకార‌ణంగా నింద‌లు వేయొద్దు.. బీజేపీ అభ్యర్థి మృతితో నాకెలాంటి సంబంధం లేదు: మంత్రి వాకిటి శ్రీహరి

Vakiti Srihari | మ‌క్త‌ల్ (Makthal) మున్సిపాలిటీ ఆరో వార్డు బీజేపీ (BJP) అభ్య‌ర్థి మ‌హ‌దేవ‌ప్ప ఆత్మ‌హ‌త్య‌కు, త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి (Vakiti Srihari) అన్నారు. అకార‌ణంగా ఎవ‌రిపైనా నింద‌లు వేయొద్ద‌ని చెప్పారు. త‌న‌పై చేస్తున్న ఆరోప‌ణ‌లు రుజువైతే దేనికైనా సిద్ధ‌మేన‌ని తెలిపారు.

G

Telangana | Published On Feb 12, 2026, 1.06 pm IST

Vakiti Srihari | అకార‌ణంగా నింద‌లు వేయొద్దు.. బీజేపీ అభ్యర్థి మృతితో నాకెలాంటి సంబంధం లేదు: మంత్రి వాకిటి శ్రీహరి
Advertisement

Vakiti Srihari | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌క్త‌ల్ (Makthal) మున్సిపాలిటీ ఆరో వార్డు బీజేపీ (BJP) అభ్య‌ర్థి మ‌హ‌దేవ‌ప్ప ఆత్మ‌హ‌త్య‌కు, త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి (Vakiti Srihari) అన్నారు. అకార‌ణంగా ఎవ‌రిపైనా నింద‌లు వేయొద్ద‌ని చెప్పారు. త‌న‌పై చేస్తున్న ఆరోప‌ణ‌లు రుజువైతే దేనికైనా సిద్ధ‌మేన‌ని తెలిపారు.

మహదేవప్పకు తాను ఎప్పుడూ కాల్‌ చేయలేద‌ని, అవసరమైతే కాల్‌ డేటా పరిశీలించాల‌న్నారు. త‌న 30 ఏండ్ల రాజ‌కీయ జీవితంలో ఎవ‌రినైనా బెదిరించిన‌ట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అన్నారు. రాజ‌కీయ ల‌బ్ది కోసం త‌న‌పై నింద‌లు వేయ‌డం స‌రికాద‌ని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక తర్వాతే అసలు కారణాలు వెల్లడవుతాయ‌ని తెలిపారు. ఎన్నికల భయంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశార‌న్నార‌ని వెల్ల‌డించారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోంద‌ని స్ప‌ష్టం చేశారు.

కాగా, మ‌హ‌దేవ‌ప్ప మ‌ర‌ణంపై ఆయన భార్య సత్యమ్మ స్పష్టతనిచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతానేమోనన్న భయంతోనే తన భర్త మనస్తాపం చెంది బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డార‌ని చెప్పారు. తనకు ఎవరూ ఓటు వేయరని భయపడ్డార‌ని వెల్ల‌డించారు. ఆయన మరణంపై తమకు ఎవరిపైనా అనుమానాలు లేవన్నారు. ఈ మేర‌కు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement