Minister Uttam Kumar reddy | బియ్యం ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Minister Uttam Kumar reddy | తెలంగాణను దేశంలోనే అగ్రగామి వరి ఉత్పత్తి రాష్ట్రంగా నిలిపిన తర్వాత, బియ్యం ఎగుమతులు, ఆధునిక సాంకేతికతలు, విలువ ఆధారిత ఉత్పత్తుల రంగంలో కూడా ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Minister Uttam Kumar reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణను దేశంలోనే అగ్రగామి వరి ఉత్పత్తి రాష్ట్రంగా నిలిపిన తర్వాత, బియ్యం ఎగుమతులు, ఆధునిక సాంకేతికతలు, విలువ ఆధారిత ఉత్పత్తుల రంగంలో కూడా ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ రైస్ అండ్ గ్రెయిన్స్ టెక్ ఎక్స్పో-2026లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధిలో రైస్ మిల్లర్లు కీలక భాగస్వాములని పేర్కొన్న మంత్రి, రైతులు, మిల్లర్లు, వినియోగదారులు అందరూ కలిసి అభివృద్ధి ఫలాలను పొందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఎగుమతి ఆధారిత రైస్ మిల్లులకు ప్రోత్సాహకాలు
బియ్యం ఎగుమతులను పెంచేందుకు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు అయ్యే ఎగుమతి ఆధారిత రైస్ మిల్లులకు, అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న మిల్లులు ఎగుమతుల వైపు మళ్లేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. ప్రపంచ బియ్యం మార్కెట్లలో తెలంగాణకు ప్రత్యేక స్థానం కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమన్నారు.
యాంత్రీకరణ ద్వారానే భవిష్యత్ అభివృద్ధి
రైస్ మిల్లింగ్ రంగంలో కార్మికుల కొరత ప్రధాన సవాలుగా మారిందని పేర్కొన్న మంత్రి, యాంత్రీకరణ, ఆటోమేషన్కు మిల్లర్లు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా ఉత్పాదకత పెరగడంతో పాటు కార్మికుల కొరత సమస్యను అధిగమించవచ్చన్నారు.
ఆధునిక నిల్వ సదుపాయాలపై దృష్టి
స్టీల్ సైలోలు, ఆటోమేటెడ్ గోదాములు, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ధాన్య పర్యవేక్షణ వ్యవస్థలు, డిజిటల్ ఇన్వెంటరీ నిర్వహణ వంటి ఆధునిక నిల్వ సదుపాయాల నిర్మాణం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రజా-ప్రైవేటు భాగస్వామ్య (PPP) విధానంలో భారీ సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఆహ్వానించారు.
పర్యావరణ హిత పార్బాయిలింగ్ సాంకేతికతలు అవసరం
పార్బాయిలింగ్ యూనిట్లలో నీటి వినియోగాన్ని తగ్గించే, విద్యుత్ ఆదా చేసే ఆధునిక సాంకేతికతలను పరిశ్రమలు అవలంబించాలని మంత్రి సూచించారు. భవిష్యత్ ప్రాసెసింగ్ యూనిట్లు నీటి పునర్వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
పోషక విలువలతో కూడిన బియ్యం ఉత్పత్తి
నాణ్యతతో పాటు పోషక విలువలను కూడా దృష్టిలో ఉంచుకుని బియ్యం ప్రాసెసింగ్ జరగాలని మంత్రి అన్నారు. నియంత్రిత వైటనింగ్, ప్రిసిషన్ పాలిషింగ్, పోషకాలను కాపాడే సాంకేతికతలు, AI ఆధారిత నాణ్యత నిర్ధారణ విధానాలు వినియోగదారులకు మరింత ఆరోగ్యకరమైన బియ్యం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
దేశానికి దిక్సూచి తెలంగాణ
ప్రస్తుతం తెలంగాణలో ఏటా సుమారు 300 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరుగుతోందని మంత్రి తెలిపారు. దేశంలో యాసంగి వరి కొనుగోళ్లలో తెలంగాణ వాటా దాదాపు 60 శాతం ఉందన్నారు. ప్రస్తుత ఖరీఫ్, యాసంగి సీజన్లలో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం దాదాపు రూ.39 వేల కోట్లు జమ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు రూ.96 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకం ద్వారా 3.2 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోందని, ఇందుకోసం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు, మిల్లర్లు, సాంకేతిక నిపుణులు, విధాన రూపకర్తలు సమష్టిగా కృషి చేస్తే తెలంగాణ బియ్యం ఉత్పత్తిలోనే కాకుండా, బియ్యం సాంకేతికత, ఆవిష్కరణలు, ఎగుమతుల రంగంలో కూడా ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MK Stalin | రాష్ట్రపతి పాలనను అడ్డుకునేందుకే విజయ్కి మద్దతు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టాలిన్..!
- ●Pooja Hegde | 70 కోట్ల బడ్జెట్ - ఏడు కోట్ల కలెక్షన్స్ - పూజా హెగ్డే ఖాతాలో మరో ఫ్లాప్
- ●CM Revanth Reddy | భారత్ ఫ్యూచర్ సిటీ కట్టి తీరుతాం.. తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
- ●KTR | కాలనాగులతో జాగ్రత్త.. 2028లో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే : కేటీఆర్
- ●CM Revanth Reddy | పొలిమేర్లు కూడా దాటవు కిషన్ రెడ్డి.. హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి
- ●CV Anand | మహిళల, పిల్లల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం : డీజీపీ సీవీ ఆనంద్

MK Stalin | రాష్ట్రపతి పాలనను అడ్డుకునేందుకే విజయ్కి మద్దతు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టాలిన్..!

Pooja Hegde | 70 కోట్ల బడ్జెట్ - ఏడు కోట్ల కలెక్షన్స్ - పూజా హెగ్డే ఖాతాలో మరో ఫ్లాప్

CM Revanth Reddy | భారత్ ఫ్యూచర్ సిటీ కట్టి తీరుతాం.. తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

KTR | కాలనాగులతో జాగ్రత్త.. 2028లో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే : కేటీఆర్




