త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Uttam Kumar Reddy | క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ ధ‌ర పెంపు.. ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డ‌మే : మంత్రి ఉత్త‌మ్

Minister Uttam Kumar Reddy | క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ ధ‌ర పెంచ‌డ‌మంటే ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డ‌మే అని రాష్ట్ర నీటి పారుద‌ల‌, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. గ్యాస్ ధ‌ర పెంపుతో సామాన్యుడిపై పెనుభారం ప‌డ‌నుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On May 1, 2026, 3.44 pm IST

Minister Uttam Kumar Reddy | క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ ధ‌ర పెంపు.. ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డ‌మే : మంత్రి ఉత్త‌మ్
Advertisement

Minister Uttam Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ ధ‌ర పెంచ‌డ‌మంటే ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డ‌మే అని రాష్ట్ర నీటి పారుద‌ల‌, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. గ్యాస్ ధ‌ర పెంపుతో సామాన్యుడిపై పెనుభారం ప‌డ‌నుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

19 కేజీల గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను రూ. 993కు పెంచండంపై శుక్రవారం రోజు ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ఒక్కసారిగా 30 నుండి 35 శాతం పెంచడంతో హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లతో సహా చిన్న తరహా వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన 24 గంటలు పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ముమ్మాటికీ ఇది ప్రజలను మోసం చేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని బెంగాల్ ఎన్నికలు పూర్తి కాగానే కమర్షియల్ గ్యాస్ ధర పెంచడం అంటే సామాన్యులను మోసం చేయడమే నని ఆయన విమర్శించారు.

కేంద్రం పెంచిన ధరలతో 19 కేజీల గ్యాస్ ధర రూ. 3 వేల‌కు మించి పోయిందన్నారు. కమర్షియల్ గ్యాస్ ధర పెంపుతో సామాన్యుల జీవన ప్రమాణాలపై కోలుకోలేని దెబ్బ పడుతుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరల పెంపు నిర్ణయాన్ని ఉప సంహారించుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement